"మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|

0
187

మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో సేవలు అందించిన ముగ్గురు పోలీస్ అధికారులు నేడు పదవీ విరమణ పొందారు. 

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. 

పదవీ విరమణ పొందిన వారిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ సబ్ ఇన్స్పెక్టర్ కె. కరుణాకర్ రెడ్డి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హెచ్. బండయ్య మరియు ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్‌లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన బి. కిష్టయ్యలు ఉన్నారు.

ఈ సందర్భంగా మల్కాజిగిరి అడ్మిన్ డీసీపీ శివ కుమార్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇన్నేళ్ల పాటు శాఖకు సేవలు అందించడం గర్వకారణమని కొనియాడారు. 

వారి క్రమశిక్షణను అభినందిస్తూ భవిష్యత్తులో వారు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీఏఓ అడ్మిన్ శ్రీనివాస్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ నాయుడు, కో ఆపరేటివ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ట్రెజరర్ బాలరాజు, డైరెక్టర్లు సువర్ణ, వల రాజు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో రక్తదానం శిబిరం జరిగినది, రక్తదానం చేసి ప్రాణదాతలు కండి.
పుంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-01-30 15:13:46 0 170
Andhra Pradesh
పవిత్రమైన తిరుమల తిరుపతి పై మచ్చగా బి.ఆర్ నాయుడు
ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహ జ్వాలలు  ఎమ్మిగనూరులో జరిగిన భారీ నిరసన...
By Boya Dasthagiri 2026-04-04 08:18:11 0 207
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రాయచోటి నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి
రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం టౌన్...
By Benguluri Madhubabu 2026-03-23 12:10:08 0 218
Andhra Pradesh
విద్యా సంఘాల నాయకులు అడ్డుకోవడం జరిగింది
ఆదోని లో భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి. నియమ నిబంధనలను తుంగలోదొక్కి అక్కడ...
By Boya Dasthagiri 2026-05-05 16:26:02 0 139
Telangana
కనకదుర్గ అమ్మవారి గుడిని పట్టించుకోని ఆలయ నిర్వాహకులు
చిలుకూరు మండలం బేతవోలు గ్రామం లో కొలువైనటువంటి శ్రీ కనకదుర్గ అమ్మ వారి గుడి, అంగరంగ వైభవంగా...
By Nookapangu Manikanta 2026-05-22 08:52:07 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com