"మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|

0
189

మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో సేవలు అందించిన ముగ్గురు పోలీస్ అధికారులు నేడు పదవీ విరమణ పొందారు. 

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. 

పదవీ విరమణ పొందిన వారిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ సబ్ ఇన్స్పెక్టర్ కె. కరుణాకర్ రెడ్డి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హెచ్. బండయ్య మరియు ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్స్‌లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన బి. కిష్టయ్యలు ఉన్నారు.

ఈ సందర్భంగా మల్కాజిగిరి అడ్మిన్ డీసీపీ శివ కుమార్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఇన్నేళ్ల పాటు శాఖకు సేవలు అందించడం గర్వకారణమని కొనియాడారు. 

వారి క్రమశిక్షణను అభినందిస్తూ భవిష్యత్తులో వారు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీఏఓ అడ్మిన్ శ్రీనివాస్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ నాయుడు, కో ఆపరేటివ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ట్రెజరర్ బాలరాజు, డైరెక్టర్లు సువర్ణ, వల రాజు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
శ్రీరామనవమి..హనుమంత్ రావు తో అల్వాల్‌లో భక్తి వైభవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లోని పలు కాలనీలలో ఈరోజు శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 12:06:03 0 164
Andhra Pradesh
టీడీపీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం విజయవంతం.
మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-06-25 05:59:04 0 56
Andhra Pradesh
ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్.
    ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్...
By Pagadala Venkateswar 2026-05-15 06:19:25 0 104
Andhra Pradesh
ప్రజల సమస్యలకే ప్రాధాన్యం ఉదయాన్నే ప్రజాదర్బార్లో అందుబాటులోకి వచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఉన్న మంత్రి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా...
By Benguluri Madhubabu 2026-06-14 03:54:02 0 136
Andhra Pradesh
విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు : కోడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు : కోడుమూరు  : ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి...
By Hari Krishna 2026-01-05 23:54:57 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com