నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.

0
62

అరుదైన పీకాక్ టారంటులా సాలీడు పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం

నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ప్రత్యేక సర్వే ప్రారంభం

అటవీ శాఖ, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం

తీవ్రంగా అంతరించిపోతున్న ఈ జీవి తూర్పు కనుమలకే ప్రత్యేకం

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ పరిరక్షణ చర్యలు

తూర్పు కనుమలకే తలమానికమైన అరుదైన జీవి పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న పీకాక్ టరంటులా (Poecilotheria metallica) అనే సాలీడు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, అటవీ శాఖ ఈ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 

నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని అడవుల్లో ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సహకారంతో ఏపీ అటవీ శాఖ ఈ సాలీడుపై పరిరక్షణ స్థితి సర్వేను ప్రారంభించింది. నీలం రంగులో మెరిసిపోయే ఈ పీకాక్ టరంటులా ప్రపంచంలో కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లోని చాలా చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం. ఇది అత్యంత అరుదైన, ప్రత్యేకమైన జీవి కావడంతో దీనిని కాపాడుకోవడం ఎంతో కీలకం.

 

ఈ సర్వే ద్వారా నల్లమల అడవుల్లో ఈ సాలీళ్ళ జనాభా, విస్తరణ మరియు ఆవాసాల పరిస్థితిని అంచనా వేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా వాటి భవిష్యత్తును కాపాడేందుకు పటిష్టమైన పరిరక్షణ ప్రణాళికలు రూపొందిస్తారు. కేవలం పెద్ద జంతువులే కాకుండా, ఇలాంటి అరుదైన, ప్రత్యేకమైన జీవులను కాపాడుకోవడం కూడా జీవవైవిధ్య పరిరక్షణలో ముఖ్య భాగమని అధికారులు తెలిపారు. ఈ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎన్నో మంచి పనులకు నాంది పలుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కత్తిపూడి బాధితుడు ముత్తిన రామకృష్ణను పరామర్శించిన BCY పార్టీ అనూష యాదవ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
By BABJI DADALA 2026-01-05 03:25:00 0 314
Lakshdweep
Blue Economy: The Mariculture Roadmap
Lakshadweep is set to become India’s hub for "Blue Economy" following the 2026 Sustainable...
By Dunna Jessicaruth 2026-05-14 10:51:34 0 64
Andhra Pradesh
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు
కర్నూలు : తెలుగుదేశం పార్టీలో లోక్ సభ నియోజకవర్గ (జిల్లా) అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను...
By Hari Krishna 2025-12-21 09:30:04 0 191
Telangana
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు- బరిలో అభిషేక్ సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి .|
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను...
By Sidhu Maroju 2026-03-05 06:44:04 0 125
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాద్ సారధ్యంలో ఎస్ హెచ్ జి మహిళలకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ అభివృద్ధి కార్యక్రమం
*విజ‌య‌వాడ* *27-01-2026*   *స్క్రోలింగ్ పాయింట్స్*   *ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-01-27 11:49:44 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com