ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,

0
547

మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు, జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ 150, ఐకెపి 50,  గిరిజన కార్పొరేషన్ 8,  మెప్మా 1, శాఖల ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన మొత్తం ( 209 ) కేంద్రాల నుండి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3934.860 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు,అకాల వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.ప్రభుత్వం సూచించిన ప్రకారం మ్యాచర్ వచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని, ధాన్యం కేంద్రాల వద్ద త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, రవాణా చేయు విషయంలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలను సిద్ధం చేయాలని, గన్ని సంచులు, మ్యాచ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, టెంట్లు, చేర్లు, తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.కొనుగోళ్లు చేసిన దాన్యంకు సంబంధించి రైతుల ఖాతా వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు త్వరగా పడే విధంగా సంబంధిత సెంటర్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, సివిల్ సప్లై అధికారి రమేష్, మేనేజర్ సివిల్ సప్లై నరసింహరావు, సంబంధిత నిర్వాహకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
కొడుకుపై ఆరోపణలు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన...
By Ponnala Srinivasrao 2026-05-10 01:40:57 0 81
Andhra Pradesh
మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ ప్రారంభోత్సవం చిల్లపల్లి శ్రీనివాసరావు
*మంగళగిరిలో గాయత్రి బ్యాంక్ బ్రాంచ్ శుభారంభం*   *-తెలుగురాష్ట్రాల్లో విస్తరిస్తున్న...
By Rajini Kumari 2026-01-28 12:58:58 0 140
Andhra Pradesh
V N Mobiles company donates franklin ev scooter to t t d
👆 *టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం*   తిరుమల, 2026 ఏప్రిల్ 21: తిరుపతికి చెందిన...
By G k Nookala 2026-04-23 12:58:48 0 107
Andhra Pradesh
దోర్నాల పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమలకు యర్రగొండపాలెం ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు శంకుస్థాపనలు ప్రారంభించారు ప్రారంభాలు చేశారు ఈ సందర్భంగా ఈ క్రింద తెలిపిన కార్యక్రమంలో పాల్గొన్నారు
దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-01-11 13:15:04 0 251
Andhra Pradesh
కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
 చింతూరు న్యూస్ :- జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ...
By Shyamala Yadagiri 2026-03-14 05:26:27 0 276
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com