"డీజీపీ. C V. ఆనంద్, ముఖ్యమంత్రితో భేటీ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.|

0
169

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగానియామకమైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బంజారాహిల్స్‌లోని స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో మర్యాదపూర్వకంగా కలిశారు. 

తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పోలీస్ బాస్‌గా బాధ్యతలు అప్పగించినందుకు ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

1991 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్  ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి  ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందిన తర్వాత, మే 1వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై కీలక దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని, మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, ఏసీబీ డైరెక్టర్‌గా సీవీ ఆనంద్ కనబరిచిన సమర్థవంతమైన పనితీరును పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఆయన సీనియారిటీకి పట్టం కడుతూ ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్. డ్రైనేజీ లు క్లియర్
నిజామాబాద్‌ జిల్లా నెహెరునగర్‌లో శుక్రవారం గ్రామ సర్పంచ్‌ ఇమ్రాన్‌ అధ్వర్యంలో...
By Sadaq Sadaq 2026-03-06 17:29:50 0 137
Andhra Pradesh
మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు....
By Pagadala Venkateswar 2026-02-10 04:45:40 0 116
Telangana
"మైనంపల్లి విరాళంతో అల్వాల్‌లో ఇందిరా గాంధీ కొత్త విగ్రహం"
మేడ్చల్ మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ ప్రధాన రహదారిపై ఉన్న ఇందిరా...
By Sidhu Maroju 2026-05-19 13:25:19 0 72
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com