పోలవరం ముంపు మండలాల రైతుల డీజిల్ సమస్యకు చెక్..!!
Posted 2026-04-28 17:47:25
0
214
చింతూరు, వి, ఆర్,పురం, కూనవరం మండలాల రైతులకు ఎదురవుతున్న డీజిల్ కొరత సమస్యపై పంటల రవాణాకు డీజిల్ దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ, మంగళవారం రైతుల బృందం ఐటీడీఏ పీఓ (PO) శుభం నోక్వాల్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రైతుల విజ్ఞప్తిని సావధానంగా విన్న పీఓ, తక్షణమే స్పందించారు. పంటల కోత మరియు రవాణా సమయం కాబట్టి, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డీజిల్ సరఫరాకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీఓ ఇచ్చిన భరోసాతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు రంగారెడ్డి, గంగయ్య, నరసింహారావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా మరియు బందోబస్తు నిర్వహణపై గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో కలసి హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.
🚩 నేటి నుంచి (11.02.2026) ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సమావేశాలు సజావుగా...
పుంగనూరు నియోజకవర్గం : కుల మతాలకతీతంగా నిత్యవసరాలు పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం, నంజoపేటలో కిద్మతే ఈ కల్క్ మైనారిటీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం...
మదనపల్లెలో టిప్పర్ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో సోమవారం సీటీఎం రోడ్డు దేవతానగర్ వద్ద గుర్తుతెలియని మహిళను...
ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జీవోలు దగ్ధం
*ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవోలు దహనం*
*భోగిమంటల్లో జీవో 590,...
Pranami Program by WB Police Protects Elderly Living Alone Daily
West Bengal Police runs ‘Pranami’ program for senior citizens living alone. Beat...