హరిప్రసాద్ నగర్‌లో వైభవంగా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు - 63 ఏళ్లుగా కృష్ణబలిజ సంఘీయుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సంప్రదాయం

0
173

చీరాల

చీరాల పట్టణంలోని 29వ వార్డు హరిప్రసాద్ నగర్‌లో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 63వ ఆరాధన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. దేవస్థానం కమిటీ సభ్యులు, దాతల సహకారంతో ఈ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవం

ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రాకతో హరిప్రసాద్ నగర్ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి. గత 63 సంవత్సరాలుగా కృష్ణబలిజ సంగీయుల ఆధ్వర్యంలో ఈ ఆరాధన కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి జెండాను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తూ నిర్వహించిన ఈ ఊరేగింపులో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాతల సహకారంతో ఏటేటా ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తున్నామని దేవస్థానం కమిటీ,నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను...
By Boiena Rajesh 2026-03-24 11:24:00 0 166
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ PS No 140 లో సర్ (SIR) కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.దాంపల్లి జ్యోతి...
By Sadaq Sadaq 2026-05-20 17:57:37 0 47
Telangana
పారి స్థాయిలో లొంగిపోయిన మావోయిస్టు
ఆయుధాలు, హింస ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకదని, ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు...
By Pinnehasan Odela 2026-03-07 15:38:02 0 159
Andhra Pradesh
పుంగనూరు: బస్సు ఢీకొని యువకుడి మృతిచెందాడు.
సదుం మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చెరుకువారిపల్లె గ్రామానికి చెందిన రఫీ...
By Kothuru Murali 2026-01-12 08:35:39 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com