కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ.

0
102

మొక్కజొన్న కనీస మద్దతు ధర కంటే భారీగా పడిపోయిన మార్కెట్ ధరలు

ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి

నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రబీ సీజన్‌లో మొక్కజొన్న ధరలు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

 

ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1,600 నుంచి రూ.1,700 మధ్యే పలుకుతోందని, అయితే కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400గా ఉందని చంద్రబాబు తన లేఖలో వివరించారు. ఈ ధరల వ్యత్యాసం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని ఆయన తెలిపారు. "రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనగా ఉన్నారు. మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువగా ప్రస్తుత మార్కెట్ ధర ఉంది," అని సీఎం తన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

 

ఈ నేపథ్యంలో, రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఆశా (PM-AASHA) పథకం కింద 'ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని' (PDPS) తక్షణమే అమలు చేయాలని చంద్రబాబు కోరారు. ఈ పథకం కింద అయ్యే 100 శాతం ఆర్థిక భారాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేశారు. నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని, ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలని లేఖలో అభ్యర్థించారు. కేంద్రం సకాలంలో స్పందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని, రాష్ట్ర ప్రభుత్వంపై కూడా అదనపు భారం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Tamilnadu
Businesses Urge Government to Lower Commercial LPG Prices
Facing unsustainable operational burdens, a coalition of business associations—including...
By Lokeshwari Panthadi 2026-07-01 04:31:44 0 42
Delhi - NCR
Delhi Police Arrest 255 in Operation Kavach Drive
Delhi Police arrested 255 alleged drug traffickers during the 14th edition of Operation Kavach, a...
By Navya Sree 2026-06-27 06:33:54 0 60
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులతో సమరాలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా తెలుగుమహిళలు ఇళ్ల ముందు రంగోలి...
By Boya Dasthagiri 2026-04-05 13:50:16 0 237
Andhra Pradesh
గంగమ్మ గుడి పక్కన బాత్రూమ్ నిర్మాణంపై నివాసుల అభ్యంతరం.
మదనపల్లె చలపతిరావు కాలనీలో గంగమ్మ గుడికి ఆనుకుని మున్సిపల్ బాత్రూములు నిర్మించడాన్ని కాలనీ...
By Pagadala Venkateswar 2026-03-09 09:08:27 0 136
Andhra Pradesh
కుటుంబ సభ్యులకు పరామర్శ !!
కర్నూలు : కర్నూల్‌ గవర్నమెంట్ హాస్పిటల్‌లో మాజీ గన్‌మన్ నాగేష్ మృతి చెందిన వార్త...
By Hari Krishna 2025-12-21 09:33:16 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com