గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ.

0
66

15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు

తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలలో 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

పర్యటనలో భాగంగా సింహాచలం దర్శనం, రైల్వే జోన్ అధికారులతో సీఎం భేటీ

రాత్రి గూగుల్ ప్రతినిధులతో సమావేశమై విందు ఇచ్చిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. విశాఖపట్నంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు.

 

దాదాపు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో, 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్‌ను నిర్మించనున్నారు. దీని కోసం విశాఖ జిల్లాలోని తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో ప్రభుత్వం సుమారు 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ రూపురేఖలు మారడంతో పాటు, రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని భావిస్తున్నారు.

 

ఈ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి సీఎం చంద్రబాబు గూగుల్ కంపెనీ ప్రతినిధులకు ఆత్మీయ విందు ఇచ్చారు. నేటి భూమిపూజ కార్యక్రమం తర్లువాడలో జరగనుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని, సీఎం చంద్రబాబు డెలిగేట్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

అనంతరం మధ్యాహ్నం సింహాచలం వెళ్లి శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం తన విశాఖ పర్యటన ముగించుకుని అమరావతికి తిరుగు పయనమవుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఒక సాధారణ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! లాటరీ కాదు.. పర్ఫెక్ట్‌ స్ట్రాటజీతో..
ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తక్కువ జీతంతో తన ఆర్థిక ప్రయాణాన్ని ప్రారంభించి, క్రమశిక్షణతో...
By Pagadala Venkateswar 2026-01-13 07:15:35 0 153
Telangana
నూతన బొడ్రాయి ప్రతిష్టాపన, పాల్గొన్న బిఆర్ఎస్ నేతలు |
సికింద్రాబాద్.. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట్ హమాలి బస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2025-10-26 10:00:32 0 231
Andhra Pradesh
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద వరి కుప్ప దగ్దం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం..
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్దవరి కుప్ప దగ్దం...  గుర్తు తెలియని వ్యక్తులు...
By Gadiyapudi Narendra 2026-01-06 11:10:33 0 298
Andhra Pradesh
మాజీ ప్రధాని జన్మదిన వేడుకలు !
కర్నూలు ; ఘనంగా మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు ...భారతరత్న, మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ...
By Hari Krishna 2025-12-26 00:41:28 0 184
Telangana
మల్కాజ్ గిరి లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి ఆర్‌.కే.నగర్, శ్రీ పంచమి హోటల్ సమీపంలో...
By Sidhu Maroju 2025-11-24 10:37:35 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com