ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ.

0
69

ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రారంభం

'బిల్ డిస్కౌంటింగ్' విధానంలో రూ.1000 కోట్లు విడుదల

ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ. 62 కోట్ల చెల్లింపు పూర్తి

కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.5,556 కోట్లు

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ప్రక్రియను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. 'ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్' (టీబీడీఏ) విధానంలో సుమారు రూ.1,000 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ.62 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

 

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 323 ఆసుపత్రులు ఈ విధానం కింద దరఖాస్తు చేసుకున్నాయి. బకాయిల చెల్లింపు పురోగతిపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ చక్రధర్ బాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు నివేదించారు.

 

ప్రస్తుతం 873 ప్రైవేటు ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం రూ.2,044 కోట్లు బకాయి పడింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.1,000 కోట్ల బిల్లుల పరిశీలన పూర్తి చేసి, చెల్లింపులు జరుపుతోంది. ఈ విధానంలో, ప్రభుత్వం తరఫున ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీపీఎఫ్‌సీ) నిధులు చెల్లిస్తుంది. ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో వార్షిక వడ్డీని ముందుగానే మినహాయించి, మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తుంది.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు మొత్తం రూ.5,556 కోట్లు చెల్లించింది. గత వైకాపా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.2,403 కోట్ల బకాయిలను కూడా ఇందులో భాగంగానే చెల్లించడం గమనార్హం. తాజా చెల్లింపులతో కలిపి ఆసుపత్రులకు మరింత ఊరట లభించనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: గన్నవరం ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు.
విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన...
By Pagadala Venkateswar 2026-01-25 06:25:53 0 131
Andhra Pradesh
మహిళా ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
*మహిళా ద్రోహి జగన్*   * రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ * వైసీపీ హయాంలో మహిళల...
By Rajini Kumari 2026-03-10 09:12:56 0 233
Telangana
అయ్యో నా పతి దేవుడు గుండెపోటుతో చనిపోయాడని బోరుమంది.. కట్ చేస్తే..
గుండెపోటు ముసుగులో జరిగిన హత్యను మేడిపల్లి పోలీసులు ఛేదించారు. భర్తను ఉరివేసి హత్య చేసిన భార్యతో...
By SivaNagendra Annapareddy 2025-12-23 07:02:20 0 223
Andhra Pradesh
అమరావతిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు !!
కర్నూలు సిటీ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని  అమరావతిలో  మొదటిసారిగా నిర్వహించిన...
By Hari Krishna 2026-01-26 08:28:12 0 388
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com