నర్సంపేట మున్సిపాలిటీ భారత జనగణన సర్వే....

0
186

 

*నర్సంపేట మున్సిపాలిటీ,వరంగల్ జిల్లా.* 

*భారత జనగణన 2027 డిజిటల్ సర్వేలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి..*

*- నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్*...

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనగణన 2027 డిజిటల్ సర్వే ప్రక్రియలో భాగంగా నర్సంపేట పట్టణ ప్రజలందరూ స్వీయ గణన ( సెల్ఫ్ ఏంయుమరేషన్ ) చేసుకోవాలని పిలుపునిచ్చారు...

 *ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ*...

- దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్వీయ గణన డిజిటల్ సర్వే అవకాశాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలినీ అన్నారు...

- ప్రజలు తమ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కోరారు...

- స్వీయ గణన ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10,2026 వరకు కొనసాగుతుందినీ అన్నారు .

- జనగణనలో పాల్గొంటే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే అపోహలు పెట్టుకోవద్దని,వాస్తవానికి అర్హులైన వారికి పథకాలు మరింత సమర్థవంతంగా చేరడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

- దేశ భవిష్యత్తు ,ప్రణాళికలు మరియు సంక్షేమ పథకాల రూపకల్పనకు జనాభా లెక్కలు అత్యంత కీలకమని, జనాభా లెక్కల ప్రక్రియలో పాల్గొనడం ప్రతి పౌరుడి బాధ్యతని అన్నారు.

*ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్,DYSO & అడిషనల్ చార్జ్ ఆఫీసర్ విజేందర్,వార్డు ఆఫీసర్ సుష్మ,జనగణన సర్వే అధికారులు,మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.....

Search
Categories
Read More
Andhra Pradesh
ఉత్తరాంధ్ర జిల్లాల్లో 60 మంది టెన్త్ టాపర్లకు ప్రభుత్వ విప్ వేపాడ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం.
లోకేష్ సారథ్యంలోని 'వంద రోజుల ప్రణాళిక'తోనే అద్భుత ఫలితాలని వేపాడ వెల్లడి టెన్త్ ఉత్తీర్ణత 81.1...
By Pagadala Venkateswar 2026-05-04 06:20:20 0 100
Andhra Pradesh
ఏపీలో కొత్తగా మొబైల్ టవర్ల ఏర్పాటు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్‌ను...
By John Baji 2025-12-29 09:22:05 0 189
Goa
Goa Focuses on Reducing School Dropout Rates
Education officials in Goa are reviewing strategies to improve the quality of education by...
By Navya Sree 2026-06-25 07:42:31 0 80
Telangana
బిఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి పై కేసు నమోదు చేయాలి
 నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు...
By Nookapangu Manikanta 2026-04-29 10:54:55 0 142
Telangana
MNCL: పదో తరగతి విద్యార్థులకు ALERT
పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష రుసుము చెల్లించలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో...
By Mitappaly Shiavji 2026-01-08 02:00:06 0 506
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com