సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.

0
92

 

సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.

 Andhra

CM Chandrababu will visit Mumbai tomorrow 

ఎకనమిక్ టైమ్స్ 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు చంద్రబాబు ఎంపిక

పాలనలో సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం

రేపు ముంబైలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ

కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంపై జ్యూరీ ప్రశంస

ముఖ్యమంత్రి ముంబై పర్యటన షెడ్యూల్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకోబోతున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రాష్ట్రంలో పాలనను పరుగులు పెట్టిస్తూ, వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ ఆయన అమలు చేస్తున్న విప్లవాత్మక విధానాలకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది. ఈ అవార్డును అందుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ముంబైలో పర్యటించనున్నారు.

 

పాలనా సంస్కరణలకు పట్టం

 

'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'తో పాటు 'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు' వంటి విధానాలను పక్కాగా అమలు చేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు చూపుతున్న చొరవను ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది. ముఖ్యంగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాష్ట్రానికి సుమారు రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకురావడంలో ఆయన సఫలీకృతం కావడం ఈ అవార్డు ఎంపికలో కీలక పాత్ర పోషించింది. 

 

పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడం, టెక్నాలజీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ రంగాల్లో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే ఆయన లక్ష్యాన్ని జ్యూరీ కొనియాడింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టిన అనుభవాన్ని ప్రస్తుత నవ్యాంధ్ర నిర్మాణంలోనూ చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని పేర్కొంది.

 

ముంబైలో ఘనంగా కార్యక్రమం

 

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల మధ్య ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, ఎస్. జై శంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. వారి సరసన ఇప్పుడు చంద్రబాబు చేరనున్నారు.

 

సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..

 

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అమరావతి నుంచి ముంబైకి వెళ్లనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఈ విధంగా ఉంది...

శనివారం మధ్యాహ్నం 12:50 గంటలకు: ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.

మధ్యాహ్నం 2:40 గంటలకు: ముంబై విమానాశ్రయానికి చేరుకుంటారు.

సాయంత్రం 5:25 గంటలకు: అవార్డుల కార్యక్రమం జరిగే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్తారు.

రాత్రి 9:30 గంటల వరకు: ఎకనమిక్ టైమ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు.

రాత్రి 9:50 గంటలకు: ముంబై నుంచి విమానంలో తిరిగి అమరావతికి పయనమవుతారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పేద ప్రజల ఇళ్లకు ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయం
ప్రచురణార్థం.14/3/2026 విజయవాడ  పునరావాసం క్రింద సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ వెనుక ...
By Rajini Kumari 2026-03-14 11:26:44 0 180
Telangana
"మీ బండి కూడా ఉందా..? 446 వాహనాల జాబితా విడుదల చేసిన పోలీసులు”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో...
By Sidhu Maroju 2026-05-26 10:52:16 0 133
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో గుంటూరు
ఈస్ట్ సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ గుంటూరు.    గుంటూరులో యువతకు సందేశాన్ని ఇచ్చారు.
By KOTESWARARAO KVSR 2025-12-23 10:48:01 0 169
Andhra Pradesh
మరి కాసేపట్లోజూరిచ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
దావోస్   • *కాసేపట్లో జూరిచ్ చేరుకోనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.*   •...
By Rajini Kumari 2026-01-19 11:42:14 0 153
Telangana
మౌలానా అబ్దుల్ రషీద్ మజ్లిస్ అంతిమ విడ్కోలు
  నిజామాబాద్ కు చెoదిన ప్రముఖధార్మిక పండితుడు.గాంధీ చౌక్ మస్జిద్-ఎ-కచియా ఇమం మౌలానా అబ్దుల్...
By Sadaq Sadaq 2026-02-27 00:00:21 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com