నిజామాబాద్.:కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...

1
384

తేదీ:23.04.2026.

నిజామాబాద్.కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...

నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల గారు మాట్లాడుతూ...కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం ద్వారా న్యాయం గెలిచిందని పేర్కొన్నారు.

కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందన్నారు.

ముఖ్యంగా సెక్షన్–8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకమని తెలిపారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారిపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్‌లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు.

న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా, చివరకు నిజం గెలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని విమర్శించారు.ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారని అన్నారు.కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిపై చేసిన ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు ఈ తీర్పుతో ఇకనైనా కనువిప్పు కలగాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గణేష్ బిగాల గారు సూచించారు.న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి ఈ హైకోర్టు తీర్పు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ VG గౌడ్ గారు,మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్,పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్,నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం,మతీన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పూర్ణాహుతి తో ఘనంగా ముగిసిన భవానీ దీక్ష ఉత్సవాలు
*పూర్ణాహుతితో వైభవంగా*   *ముగిసిన భవానీ దీక్షల ఉత్సవాలు*        ...
By Rajini Kumari 2025-12-15 10:54:18 0 205
Andhra Pradesh
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-01-05 11:47:01 0 222
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 11:10:00 0 173
Telangana
టీ ఎస్ పాలీసెట్ రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించిన కొడారు కౌశిక్ సాయి
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం కుమారుడు కొడారు కౌశిక్ సాయి ఈ రోజు విడుదలైన...
By Nookapangu Manikanta 2026-05-23 08:43:09 0 165
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమలలో ప్రారంభమైన స్వయంబేశ్వర స్వామి
సోమల మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ స్వయంబేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఉదయం...
By Kothuru Murali 2026-04-13 08:41:51 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com