రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన పెనుగంచిప్రోలు విద్యార్థిని దివ్య

0
282

రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన దివ్యకు సన్మానం

బైపీసీ కోర్సులో 990 మార్కులతో రాష్ట్రంలో మూడో స్థానం  

నందిగామ: ఇంటర్మీడియట్ బైపీసీ కోర్సులో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన తేజ జూనియర్ కళాశాల విద్యార్థిని కొండపల్లి దివ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  సౌమ్య బుధవారం ఘనంగా సన్మానించారు.  

దివ్య 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. పదో తరగతిలో కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన దివ్య, ఇంటర్మీడియట్‌లో కూడా తన ప్రతిభను కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడం విశేషం.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య  దివ్యకు శాలువా కప్పి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం
దర్శి-దొనకొండ ఇండస్ట్రియల్ ఏరియాలో BDL పరిశ్రమ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం ప్రకాశం జిల్లా...
By Chennaiah Kati 2026-07-03 12:08:52 0 43
Business & Finance
Add Partners to Your Business Through the this Process
Adding partners to your business requires a clear legal process to ensure transparency and...
By Navya Sree 2026-07-20 05:23:28 0 29
Uncategorized
The Micro-Jumping Fitness Craze
Forget hour-long gym sessions. As of May 19, 2026, the lifestyle world is obsessed with...
By Dunna Jessicaruth 2026-05-19 06:31:29 0 75
Andhra Pradesh
మాజీ సీఎం పాదయాత్ర పై బుద్దా వెంకన్న ప్రెస్ మీట్
*మీడియా మిత్రుల‌కు ఆహ్వానం* *22-01-2026*   *విలేఖ‌రుల స‌మావేశం*  ...
By Rajini Kumari 2026-01-22 12:38:02 0 214
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారి, ఓ మోస్తరు వర్షం కురిసింది....
By Kothuru Murali 2026-05-01 11:40:58 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com