రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన పెనుగంచిప్రోలు విద్యార్థిని దివ్య

0
248

రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన దివ్యకు సన్మానం

బైపీసీ కోర్సులో 990 మార్కులతో రాష్ట్రంలో మూడో స్థానం  

నందిగామ: ఇంటర్మీడియట్ బైపీసీ కోర్సులో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన తేజ జూనియర్ కళాశాల విద్యార్థిని కొండపల్లి దివ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  సౌమ్య బుధవారం ఘనంగా సన్మానించారు.  

దివ్య 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. పదో తరగతిలో కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన దివ్య, ఇంటర్మీడియట్‌లో కూడా తన ప్రతిభను కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడం విశేషం.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య  దివ్యకు శాలువా కప్పి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు.
  Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు. 27-01-2026 Tue...
By Pagadala Venkateswar 2026-01-28 10:55:47 0 117
Andhra Pradesh
సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ జనసేన
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో...
By Rajini Kumari 2026-01-11 09:46:32 0 152
Andhra Pradesh
సింగపూర్ లో ఐదవ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ
* *సింగపూర్‌లో 5 వ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ కార్యక్రమం*   * *సింగపూర్ సంక్షోభ...
By Rajini Kumari 2026-04-25 11:46:45 0 128
Andhra Pradesh
బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రోంగళి జగన్నాథరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీనుని మర్యాదపూర్వక కలయక.
విజయనగరం 24 మార్చి 2026: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు బొబ్బిలి...
By Yalakala Vasunaidu 2026-03-24 08:50:34 0 225
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో భవన కార్మికునికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు ఉదయ్...
By Pagadala Venkateswar 2026-01-26 05:39:19 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com