రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన పెనుగంచిప్రోలు విద్యార్థిని దివ్య

0
281

రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన దివ్యకు సన్మానం

బైపీసీ కోర్సులో 990 మార్కులతో రాష్ట్రంలో మూడో స్థానం  

నందిగామ: ఇంటర్మీడియట్ బైపీసీ కోర్సులో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన తేజ జూనియర్ కళాశాల విద్యార్థిని కొండపల్లి దివ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  సౌమ్య బుధవారం ఘనంగా సన్మానించారు.  

దివ్య 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. పదో తరగతిలో కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన దివ్య, ఇంటర్మీడియట్‌లో కూడా తన ప్రతిభను కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడం విశేషం.  

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య  దివ్యకు శాలువా కప్పి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించారు.

Like
1
Search
Categories
Read More
Telangana
చనిపోయిన రైతుల కుటుంబలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం రాష్ట్ర నాయకులు
 మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు...
By Avunoori Mahesh 2026-05-07 14:00:02 0 243
SURAKSHA
మహిళల భద్రతకు తెలంగాణ పోలీసుల భరోసా - షీ టీమ్స్
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, 'షీ టీమ్స్' (SHE Teams) ద్వారా ప్రత్యేక...
By Kalaga Sailaja 2026-07-01 07:28:50 0 78
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : ఏసీపీతో సహ పెద్దయెత్తున ఈటల నివాసానికి చేరుకున్న...
By Sidhu Maroju 2026-02-21 15:08:02 0 209
Telangana
కల్తీ ఆహారంపై సీపీ సజ్జనర్ వార్నింగ్.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
హైదరాబాద్: నగరంలో ఆహార పదార్థాలలో కల్తీపై పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్...
By Sidhu Maroju 2026-04-02 19:38:36 0 210
Telangana
తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్...
భారత్ అవాజ్ న్యూస్: హైదరాబాద్: తెలంగాణ  డిజిపిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ బాధ్యతలు...
By Gujile Ramu 2026-05-01 08:48:19 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com