"మోదీపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్ వర్మ డిమాండ్.|

0
240

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాదిగా అభివర్ణించడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఖర్గే వెంటనే తన నాలుకను అదుపులో పెట్టుకోవాలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం దేశ రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.

దేశంలో అన్ని రాజ్యాంగ రక్షణలు అనుభవిస్తూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి పదవి కేవలం ఒక వ్యక్తిది కాదని, అది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ఒక గొప్ప వ్యవస్థ అని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. 

ఖర్గే చేసిన ఈ ప్రకటన ప్రజాస్వామ్య విలువలకు తలవంపులు తెచ్చేలా ఉందని, ఇది విమర్శ కాదని, అత్యున్నత పదవిని దూషించడమేనని ఆయన విమర్శించారు.

భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఖర్గేపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద తక్షణమే పోలీసు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజకీయాల్లో విభేదాలు సహజమని, అయితే ప్రధానిని ఉగ్రవాది అని పిలవడం అన్ని హద్దులు దాటడమేనని శ్రీనివాస్ వర్మ అన్నారు. 

రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు హుందాతనంతో వ్యవహరించాలని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఖర్గే వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
West Bengal
Mamata’s Hindi Push in Bengal Sparks Language Debate |
On Hindi Divas, CM Mamata Banerjee announced major steps for Hindi-speaking residents in West...
By Pooja Patil 2025-09-15 10:53:29 0 199
Andhra Pradesh
బ్లాక్ స్పాట్స్ పరిశీలించిన అధికారులు
సాలూరులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్ను ట్రాన్స్పోర్ట్ పోలీస్, R&B అధికారులు...
By Boiena Rajesh 2026-04-09 01:17:22 0 133
Andhra Pradesh
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టిడిపి మహిళ నాయకులు భేటీ
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!   తెలంగాణ సీఎం...
By Rajini Kumari 2026-04-17 16:09:04 0 79
Telangana
మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో అల్వాల్ పోలీసుల కార్డన్ సెర్చ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి :  మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 250 మంది పోలీస్...
By Sidhu Maroju 2025-11-19 07:23:25 0 183
Telangana
నిజామాబాద్ : మాజీ ఎంపీపీ హత్య కేసులో 7 గురి అరెస్ట్
మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి హత్య కెసులో  ఎడుగురు నిదితులను అరెస్ట్‌ చేసినట్లు నిజామాబాద్...
By Sadaq Sadaq 2026-03-14 17:58:58 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com