"ఆల్వాల్ అభివృద్ధిపై శాంతి శ్రీనివాస్ రెడ్డి నజర్.|

0
261

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ల్లోని పలు బస్తీల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ, మంచినీటి పైప్‌లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అధికారులను కోరారు.

బుధవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజను ఆమె కార్యాలయంలో కలిసి క్షేత్రస్థాయి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. 

ముఖ్యంగా లక్ష్మీ నగర్ (లోత్ కుంట), ఇంద్రానగర్, భీమ్ రావు నగర్, ఎంఈఎస్ కాలనీ, ప్రశాంత్ నగర్, బండబస్తీ, వెంకట్రావు పేట మరియు స్టేషన్ బస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరైన పనులు నత్తనడకన సాగుతుండటంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనుల జాప్యం కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. మంజూరైన ప్రతి పనిని తక్షణమే పట్టాలెక్కించి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పూర్తి చేయాలని ఈడీని కోరారు. 

దీనిపై సానుకూలంగా స్పందించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పంకజ, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించి, జాప్యాన్ని నివారించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పెండింగ్ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆమె భరోసా ఇచ్చారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Media Academy
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society In...
By Media Academy 2025-04-28 18:13:59 0 2K
Andhra Pradesh
బాపట్ల జిల్లా బృందం గోవా పర్యటన - కోస్తా టూరిజం అభివృద్ధిపై అధ్యయనం
బాపట్ల: బాపట్ల తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా, గోవాలోని పర్యాటక...
By Gadiyapudi Narendra 2026-02-18 16:20:31 0 203
Telangana
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం. ఎమ్మెల్యే శ్రీ గణేష్.
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడం వల్ల కాలనీలలో చిన్న చిన్న సమస్యలు కూడా...
By Sidhu Maroju 2025-06-04 17:11:41 0 2K
Telangana
పోడు రైతుల సమస్యలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి గారికి వినతిపత్రం అందించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: ఆసిఫాబాద్...
By Chunarkar Jagadeesh 2026-06-28 06:37:48 0 127
Manipur
Breakthrough in Manipur: 28 Hostages Released
In a significant turn of events today, May 15, 2026, Manipur police confirmed the release of 28...
By Dunna Jessicaruth 2026-05-15 10:14:09 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com