నందవరం మండల కేంద్రంలోని కేజీబీవీ

0
117

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్ చలగాటం!

మండలకేంద్రంయిన నందవరం కేజీబీవీ హాస్టల్ లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకొచ్చిన వైనం.

ఈ నెల 17 వ తేదీన బల్లి పడిన భోజనాన్ని విద్యార్థులకు పెట్టిన వంట నిర్వహకులు.

బల్లి పడిందని విద్యార్థులు చెప్పితే తినండి ఏమి కాదులే అంటూ నవ్విన వంట సిబ్బంది.

తల్లిదండ్రులకు చెపితే టీసీలు ఇస్తామంటూ విద్యార్థులకు బెదిరింపులు?

బల్లి కాదు,మిడత అంటున్న ప్రిన్సిపల్ !

కేజీబీవీ విద్యార్థుల ప్రాణాలతో ప్రిన్సిపల్, వంట సిబ్బంది చలగాటమాడుతున్నారని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మా దృష్టికి తెలిపారు.17 వ తేదీన జరిగిన పరిస్థితిని బయటకు రాకుండా విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారని, ఎండాకాలం సెలవులు సందర్భంగా ఈరోజు బయటికి వచ్చిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపి తమ పరిస్థితిని వివరించారని తెలిపారు. ఉన్నత అధికారులు విచారణ చేపట్టి ప్రిన్సిపల్ పైన, వంట సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి అధికారుల నిర్లక్ష్యంవలన 200 మంది విద్యార్తులు విష ఆహరం తిన్నతరువాత వాంతులు చేసుకొవడం జరిగింది. ఎంతో గౌరవంతో హాస్టల్ మీద నమ్మకంతో పేద కుటుంభంనుండి వచ్చిన విద్యార్థులకు సరైన సౌకర్యం కల్పించక అభద్రతా భావంతో అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక విద్యార్ధులు చాలా అవస్తలు పడుచున్నారు. విష ఆహరం వలన విద్యార్థులకు ఎదయినా జరిగితే ఎవరు బాధ్యత తీసుకొంటారు? ఒక బాధ్యతాయుత అధికారిగా ఉండి విద్యార్థుల విషయంలొ ప్రతి విషయంలోను నిర్లక్ష్యంచేస్తూ విద్యార్ధులపాలిట శాపంగా మారిన కేజీబీవీ ప్రిన్సిపల్ మీద శాఖాపరమైన విచారణ చేసి తక్షణమే విధులనుండి సస్పండ్ చెయ్యాలని ఈ విషయంపై రాబొయే సొమవారం బిజెపి జనతా వారిది PGRS కార్యక్రమంలో తగిన ఆధారాలతో జిల్లా కలెక్టరు గారికి పిర్యాదుచేస్తామని తెలిపారు. 

ప్రిన్సిపల్ గారికి ఈ విషయంపై అరా తియ్యగా ఆ రోజు పడింది బల్లి కాదు, మిడత అంటూ సమాధానం ఇచ్చారు. విద్యార్థులు మాత్రం మిడత కాదు బల్లి పడిందని ఫోను ద్వారా తమకు తెలిపారన్నారు.

Search
Categories
Read More
Telangana
జర్నలిస్ట్ ల అక్రమ నిర్బంధం పై సిపికి జర్నలిస్టుల ఫిర్యాదు.
   హైదరాబాద్ /సికింద్రాబాద్.   శాంతిభద్రతల పరిరక్షణలో జర్నలిస్టుల సహాకారం...
By Sidhu Maroju 2025-08-05 17:27:05 0 728
Telangana
పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు యల్.బి.స్టేడియం హైదరాబాద్ లో జులై 4 న కాంగ్రెస్ పార్టీ మహాసభను విజయ వంతం చేద్దాం రండి.!!
   క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్,  అందులో భాగంగా.....
By Sidhu Maroju 2025-07-02 06:53:20 0 1K
Telangana
మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|
  హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు....
By Sidhu Maroju 2025-12-23 13:47:13 0 269
Andhra Pradesh
వైయస్సార్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు : ఎమ్మెల్యే బీవీ
కర్నూలు : కర్నూలు సిటీ :  వైసీపీని చూసి నవ్వుకుంటున్నారు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే...
By Hari Krishna 2026-01-08 08:16:05 0 157
Andhra Pradesh
Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర.
ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారన్న కొల్లు రవీంద్ర జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని...
By Pagadala Venkateswar 2026-02-07 07:19:25 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com