గంటల వ్యవధి లో కనబడని పిల్లవాడిని కనుగొన్న ఎస్ ఐ శివకుమార్ యాదవ్* *పిర్యాదు అందిన వెంటనే స్పందించిన ఎస్ ఐ*

0
185

నిన్న అనగా సోమవారం పిట్టలవానిపాలెం మండల పరిధి లోని ఖాజీపాలెం గ్రామానికి చెందిన నాగ సాయి అనే బాలుడు కనబడటం లేదు అని తల్లిదండ్రులు చందోలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. పిర్యాదు స్వీకరించిన వెంటనే ఎస్పీ గారి ఉత్తర్వులు మేరకు, డీఎస్పీ, సీఐ అదేశాల మేరకు ఆచూకీ కోసం ఎస్ ఐ శివకుమార్ వారి సిబ్బంది తో తీవ్రంగా రేయంబవళ్లు శ్రమించారు. కష్టానికి తగిన ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానం తో బాలుడి ఆచూకీ కనుగొన్నారు. దీనికి ప్రధాన కారణం ఎస్ ఐ వివరణ ప్రకారం బాలుడు తన తల్లిదండ్రులను డబ్బులు ఇవ్వమని అడగగా నిరాకరించారు. దీనితో మనస్తాపం చెంది నాగ సాయి కొంత సొమ్ము తో టికెట్ కొని మద్రాస్ రైల్ ఎక్కి పారిపోయాడు.సాంకేతిక పరిజ్ఞానం తో కనుగొనగా చెన్నై వెళ్లినట్లు గుర్తించారు. ఇంత తక్కువ సమయం లో కష్టపడి తన అనుభవం తో కేస్ ను ఛేదించినఎస్ ఐ శివకుమార్ ను బాలుడి తల్లిదండ్రులు అభినందనలు తెలుపుతున్నారు.అసలు చందోలు పోలీస్ స్టేషన్ లో ఇప్పటి ఎస్ ఐ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఎన్నో కేస్ లు ఛేదించి అందరి చేత మన్ననలు పొందారు. అంతే కాకుండా తమ శాఖ గురించి ప్రజలకు అవగాహన కలిపించటం కోసం నిత్యం కఠోర శ్రమతో ఉద్యోగ బాధ్యతలు చేస్తూ నేరగాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అని ప్రజల్లో జోరుగా అభినందనల వెల్లువెత్తుతున్నాయి.ప్రతి ఒక్కరికి ఎస్ ఐ అంటే కుటుంబసభ్యుడిలా ఉంటూ తనదైన శైలి లో ముందుకు సాగుతూ తన సిబ్బందిని కూడా నిబద్దత తో ఉద్యోగం చేయించడం ఆయన పని తీరుకు దర్పణం పడుతుంది. రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అలంకరించాలి అని ప్రతి ఒక్కరి కోరిక.దీనికి ప్రధాన కారణం ఈ స్థాయిలో ఇంత నిబద్దత తో ఉద్యోగం చేస్తూ ఉంటే ఉన్నత స్థాయి లభిస్తే ఇంకా ఎన్నో పనులు చేసి అందరి మన్ననలు పొందుతారని అందరి భావన..

Search
Categories
Read More
Rajasthan
Suspected Drone Found Near Indo-Pak Border in Rajasthan's Sri Ganganagar, Triggers Security Alert
Suspected Drone Found Near Indo-Pak Border in Rajasthan's Sri Ganganagar, Triggers Security Alert...
By BMA ADMIN 2025-05-20 06:59:27 0 2K
Andhra Pradesh
పేద ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ
బొబ్బిలి షాదీఖానాలో హుదా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పేద ముస్లింలకు ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-03-14 12:08:41 0 160
Telangana
మొండా డివిజన్ లో సివరేజ్ పైప్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్...
By Sidhu Maroju 2025-12-16 10:17:18 0 199
Andhra Pradesh
మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం...
By Pagadala Venkateswar 2026-01-26 04:11:29 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com