ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య

0
249

చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన

కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో మంగళవారం నాడు 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం కాబోతున్న వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  కూటమి నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణకు మైలురాయిగా భావించే ఈ వెల్నెస్ హెల్త్ సెంటర్ నిర్మాణం ద్వారా స్థానికులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  తెలిపారు. “ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత. ఈ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులు సులభంగా వైద్య సేవలు పొందేందుకు అనువైన వేదిక అందుతుంది” అని ఆమె అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు,కూటమి నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కేంద్రం త్వరలోనే పూర్తి కావడంతో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
ఘనంగా సౌందర్యలహరి లలిత పారాయణ వరలక్ష్మి వ్రత పూజ
     హైదరాబాద్/బాకారం.        బాకారం ముషీరాబాద్ లోని తన...
By Sidhu Maroju 2025-08-02 14:26:08 0 821
Andhra Pradesh
టీడీపీ ప్రచార రథం ప్రారంభం: ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలని పిలుపు.
రాజంపేట పార్లమెంటు కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని రాజంపేట పార్లమెంటు ప్రధాన...
By Pagadala Venkateswar 2026-02-28 07:00:37 0 93
Andhra Pradesh
నేడు వసంత పంచమి... శుభకార్యాలు చేయరాదు
వసంత పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. తెలివి తేటలు వృద్ధి చెందే రోజు గా...
By Karapati Gopi 2026-01-23 01:31:37 0 352
Andhra Pradesh
పారిశ్రామిక కేంద్రంగా జగ్గయ్యపేటకు మహర్దశ
10.04.26 ప్రచురుణార్ధం                   ...
By Rajini Kumari 2026-04-10 12:12:07 0 103
Andhra Pradesh
మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.
పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు...
By John Baji 2026-02-03 07:27:51 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com