ప్రజల ఆరోగ్యమే మా ప్రాధాన్యత : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సౌమ్య

0
286

చెవిటికల్లులో 36 లక్షలతో వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన

కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో మంగళవారం నాడు 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం కాబోతున్న వెల్నెస్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  కూటమి నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేశారు. గ్రామస్థుల ఆరోగ్య సంరక్షణకు మైలురాయిగా భావించే ఈ వెల్నెస్ హెల్త్ సెంటర్ నిర్మాణం ద్వారా స్థానికులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య  తెలిపారు. “ప్రజల ఆరోగ్యం మా ప్రాధాన్యత. ఈ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులు సులభంగా వైద్య సేవలు పొందేందుకు అనువైన వేదిక అందుతుంది” అని ఆమె అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు,కూటమి నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ శంకుస్థాపన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కేంద్రం త్వరలోనే పూర్తి కావడంతో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
వాళ్లు పార్టీ మారలేదట...
ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు ‎‎10...
By Ponnala Srinivasrao 2026-03-26 04:43:32 0 216
Telangana
Mission Bhagiratha Enhancing Safe Water Access Statewide
Mission Bhagiratha remains one of Telangana's most significant public welfare initiatives, aimed...
By Fathima Safa 2026-06-20 12:09:06 0 124
Madhya Pradesh
Monsoon Refresh: Madhya Pradesh Welcomes Vital June Rains
The India Meteorological Department (IMD) has officially confirmed the steady progression of the...
By Lokeshwari Panthadi 2026-06-27 07:59:05 0 51
Andhra Pradesh
గుంటూరులో న్యాయ- పోలీసు సమన్వయ నేర సమీక్ష సమావేశం జరిగినది.
    >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   గుంటూరులో న్యాయ–పోలీసు...
By KOTESWARARAO KVSR 2026-01-10 13:25:27 0 639
Andhra Pradesh
నందిగామలో వైసిపి బూత్ కన్వీనర్లకు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ దిశా నిర్దేశం
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో...
By Patan Khuddus 2026-05-17 16:49:30 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com