మంచిర్యాల ఎంపీ కార్యాలయం లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

0
152

మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డీసీపీ మరియు జిల్లా ఉపాధి అధికారితో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు.

సుమారు 200 మందికి పైగా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎంపీ గారు శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.

అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాలపై కూడా ఎంపీ గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో నేరుగా మాట్లాడి పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. నిజమైన అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే లోన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

జిల్లా ఉపాధి అధికారికి యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నమోదు చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు న్యాయం చేయడం, సంక్షేమ పథకాలు సరైన వారికి చేరేలా చూడడం తన ముఖ్య లక్ష్యమని ఎంపీ గారు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు తదితరులు హాజరయ్యారు.

Search
Categories
Read More
SURAKSHA
Dial 112 Upgrade Helps West Bengal Police Reach You in Minutes
Content 90 words: West Bengal Police modernized Dial 112 emergency service for instant help. When...
By Kalaga Sailaja 2026-07-01 12:52:40 0 62
Andhra Pradesh
విజయవాడ కొండపల్లి రైల్వే ట్రా క్ వెంబడి మురుగు సమస్య పరిష్కరించండి కేశినేని శివనాద్
*ప్రచురణార్థం* *22-01-2026*   కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంబడి మురుగు సమస్య...
By Rajini Kumari 2026-01-22 12:13:06 0 194
Telangana
సి. సి.రోడ్డు పనులకు శంకుస్థాపన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ (St .Pious school) సెయింట్ పాయిస్ స్కూల్ సమీపంలో రూ.30.50...
By Sidhu Maroju 2025-06-07 09:18:04 0 1K
Andhra Pradesh
దర్శి సీఎం. ఆర్. ఎఫ్ చెక్కుల పంపిణీ
దర్శిలో సీఎం.ఆర్.ఎఫ్ చెక్కుల పంపిణీ  కూటమి ప్రభుత్వంనుంచి దర్శి నియోజకవర్గంలోని అనారోగ్య...
By Chennaiah Kati 2026-01-23 13:15:38 0 197
Telangana
"అల్వాల్ వెంకటేశ్వర నగర్‌లో భక్తి పారవశ్యంతో హనుమాన్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో గల...
By Sidhu Maroju 2026-05-12 09:38:49 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com