పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు.

0
70

 

పారదర్శకంగా ఉన్నాం.. ప్రజలకు వాస్తవాలు చేరవేయండి: సీఎం చంద్రబాబు

 Andhra

Chandrababu Naidu Urges Party to Convey Facts to Public

పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు

ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమం, అభివృద్ధిలో రాజీపడటం లేదు

శిక్షణా తరగతులతో లీడర్-కేడర్ మధ్య భావోద్వేగ బంధం

ఈ నెల 29న టీడీపీ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ

ప్రజలే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి: సీఎం

రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో పనిచేస్తోందని, ఈ వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ సేవల విషయంలో తాము అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నేతలపై ఉందని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తాజా రాజకీయ పరిణామాలపై సమీక్షించారు.

 

రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళుతున్నామని చంద్రబాబు వివరించారు. ఈ కష్టాన్ని, ప్రభుత్వం పడుతున్న శ్రమను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ప్రభుత్వంపైనా, కూటమి పార్టీలపైనా కొందరు పనిగట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వివిధ మార్గాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని స్పష్టం చేశారు.

 

"ప్రజలకు వాస్తవాలు తెలిస్తే వారే విశ్లేషించుకుంటారు. పరిపాలనలో ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని వారికి వివరిస్తే, ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేలా ప్రజలే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారతారు" అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో నాటి ప్రభుత్వం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా, ప్రజలు వాస్తవాలను గ్రహించి కూటమికి అద్భుతమైన విజయాన్ని అందించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడమే మన ప్రధాన బాధ్యత అని ఆయన అన్నారు.

 

పార్టీలో నేతలకు, కార్యకర్తలకు మధ్య భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేసేందుకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు, ‘కాఫీ కబుర్లు’ వంటి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరగతుల ద్వారా పార్టీ సిద్ధాంతాలను వివరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఫీడ్‌బ్యాక్ తీసుకునే అవకాశం కలుగుతోందని తెలిపారు. పార్టీ కార్యకర్తల కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, వారి విద్య, వైద్యం, ఉపాధి కోసం ‘ఎథిక్ ఎకనమిక్ ఎంపవర్‌మెంట్’ అనే వ్యవస్థను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు.

 

ఈ నెల 29వ తేదీన పార్టీ నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించనుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని నేతలు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అలాగే, త్వరలో జరగనున్న మహానాడు నిర్వహణ కమిటీల ఏర్పాటుపైనా కసరత్తు చేస్తున్నట్టు సీఎంకు వివరించారు.

Search
Categories
Read More
Odisha
NHRC Warns Odisha Govt Over Non-Payment in Maternal Death Case
The National Human Rights Commission (NHRC) has reprimanded the Odisha government for failing to...
By Bharat Aawaz 2025-07-17 08:30:18 0 1K
Andhra Pradesh
చీటీల్లో రూ. 1. 30 కోట్లు నష్టం – ఎస్పీకి బాధితుల ఫిర్యాదు.
మదనపల్లిలో చీటీల పేరుతో సుమారు రూ. 1.30 కోట్ల మేర నష్టం జరిగినట్లు బాధితులు సోమవారం అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-02-02 12:17:22 0 109
Telangana
ఛలో అసెంబ్లీ SFI పిలుపు
పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో...
By Veeresh Kumar 2026-03-24 18:01:22 0 204
Andhra Pradesh
Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర.
ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారన్న కొల్లు రవీంద్ర జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని...
By Pagadala Venkateswar 2026-02-07 07:19:25 0 125
Andhra Pradesh
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లు
అర్హులైన పాత్రికేయులందరికీ అక్రిడేషన్లను మంజూరుచేస్తామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు....
By Boiena Rajesh 2026-03-02 14:48:45 0 142
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com