అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.

0
106

 

అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

18-04-2026 Sat 07:23 | Andhra

Sajjala Bhargav Reddy Case High Court Outraged by Defamatory Posts

వైసీపీ మాజీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌పై హైకోర్టు ఆగ్రహం

అది ఆటవిక, అనాగరిక ప్రవర్తన అంటూ తీవ్ర వ్యాఖ్యలు

సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబసభ్యులపై పోస్టులు పెడతారా అని ప్రశ్న

షరతులతో కూడిన ఉపశమనం... ఎల్‌ఓసీ రద్దుకు ఆదేశం

నిందితులపై దర్యాప్తు చేసి శిక్షపడేలా చూడాలని పోలీసులకు ఆదేశం

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రుల కుటుంబ సభ్యుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని 'ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన'గా అభివర్ణించింది. ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది.

 

తనపై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ)ను రద్దు చేయాలని కోరుతూ భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పిటిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని ధర్మాసనం గుర్తు చేసింది.

 

ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని భార్గవ్ రెడ్డిని ఆదేశించింది. అవసరమైనప్పుడు విచారణకు హాజరవుతానని అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

 

ఈ షరతులకు లోబడి భార్గవ్ రెడ్డిపై ఉన్న ఎల్‌ఓసీని రీకాల్ చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు అభ్యర్థన అందిన వెంటనే ఎల్‌ఓసీని రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కూడా ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు RTC బస్టాండ్‌కు ఆర్యవైశ్య సంఘం వాటర్ కూలర్ విరాళం కొత్తూరు మురళి
పుంగనూరు RTC బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం,...
By Kothuru Murali 2026-05-27 14:46:05 0 68
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:27 0 36
Andhra Pradesh
విజయవాడ బాంబే కాలనీలో ఎంపీ లార్డ్స్ నిధులు 75 లక్షలతో కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన
*ప్రచురణార్థం* ది:19-04-2026   *వాంబే కాలనీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ. 75 లక్షలతో కమ్యూనిటీ...
By Rajini Kumari 2026-04-19 12:29:33 0 126
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి టిడిపి మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు
తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంట్లో చట్టబద్ధత అమరావతి...
By Benguluri Madhubabu 2026-04-02 14:15:41 0 194
Andhra Pradesh
జలధార పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో చేపట్టిన జలధార 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 4,938 పనులు ప్రారంభించినట్లు...
By Pagadala Venkateswar 2026-05-02 02:37:43 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com