"మండుటెండలో ‘పోలీస్’ చల్లని పిలుపు: తిరుమలగిరిలో చలివేంద్రం ప్రారంభం!

0
153

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు అడుగు ముందుకు వేశారు.

మల్కాజిగిరి పరిధిలోని తిరుమల్ గిరి ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి చలివేంద్రాన్ని ఏసీపీ  జి. శంకర్ రాజు  ఈరోజు ఘనంగా ప్రారంభించారు.

MV ఆటోమొబైల్స్ మరియు హైజీన్ ఆక్వా సొల్యూషన్స్ సంస్థల సామాజిక బాధ్యత (CSR) కింద ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ.. వేసవిలో పాదచారులు, వాహనదారులు మరియు నిత్యం ప్రయాణించే వారు ఎండ వేడికి ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు చేశామని తెలిపారు. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.

ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఏసీపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైజీన్ ఆక్వా సొల్యూషన్స్ యజమాని శ్రీహరి, MV ఆటోమొబైల్స్ ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలందరూ ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సమాజ హితం కోసం సహకరించిన సంస్థలకు ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది....
By Pagadala Venkateswar 2026-04-02 10:26:08 0 286
SURAKSHA
Vakati Karuna, IAS: Transforming Governance with Compassion
From district administration to public health and rural development, Vakati Karuna, IAS, has...
By Lokeshwari Panthadi 2026-07-14 06:48:24 0 120
Telangana
న్యూయర్ ఫీవర్.. మీటర్ దాటితే జైలుకే..! వాహనదారులకు మాస్ వార్నింగ్!
న్యూయర్ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులకు...
By SivaNagendra Annapareddy 2025-12-25 06:32:33 0 585
Business & Finance
Madhya Pradesh Attracts Major Renewable Energy Investments
Madhya Pradesh is witnessing increased investments in renewable energy projects, particularly in...
By Navya Sree 2026-07-04 06:51:43 0 30
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు...
By Kothuru Murali 2026-03-05 05:16:57 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com