"పోలీసుల రైడ్‌తో కుదేలైన నకిలీ సర్టిఫికెట్ల ముఠా – అల్వాల్‌లో బిగ్ బస్ట్.!

0
284

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ పత్రాలను విక్రయిస్తున్న ముఠాను అల్వాల్ పోలీసులు బట్టబయలు చేశారు.

ఆల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... నమ్మదగిన సమాచారం మేరకు, ఈనెల 15న సాయంత్రం అల్వాల్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె. చంద్రశేఖర్ తన బృందంతో కలిసి తెలుగు తల్లి విగ్రహం సమీపంలోని ‘శ్రీదేవి జిరాక్స్ & నోటరీ’ షాపుపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ సమయంలో షాపులో పనిచేస్తున్న ముంద్రాతి నగేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

"ముందస్తు సంతకాలతో అక్రమ దందా.."

పోలీసుల తనిఖీలో షాపులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అడ్వకేట్ డి. రాజేందర్ రావు (బొల్లారం), డాక్టర్ డి. రవికుమార్ పేర్లతో ఉన్న నోటరీ సీళ్లు, వారి సంతకాలతో కూడిన ఖాళీ అఫిడవిట్లు భారీగా లభ్యమయ్యాయి.

ఇవే కాకుండా కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఓబీసీ (Annexure-B), ఈడబ్ల్యూఎస్ (EWS), నాన్-క్రీమీ లేయర్ అఫిడవిట్లను ముందే సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుల వివరాలు..షాపు యజమాని దుండిగల్ రాజేశ్వర్, అతని కుమారుడు అఖిల్ కుమార్ సూచనల మేరకే తాను ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు నగేష్ విచారణలో వెల్లడించాడు. 

ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తూ ఈ నకిలీ పత్రాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్నవి..భారీ సంఖ్యలో సంతకాలు చేసిన ఖాళీ అఫిడవిట్లు. నోటరీ స్టాంపులతో గ్రీన్ పేపర్లు, వివిధ పేర్లతో ఉన్న దరఖాస్తులు, అక్రమ వసూళ్లకు సంబంధించిన ఖాతా పుస్తకాలు.

ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాజేశ్వర్, అఖిల్ కుమార్, నగేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రజలు ఇలాంటి నకిలీ పత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: క్షుద్ర పూజలతో అదిరిపడ్డ ప్రజలు
శుక్రవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, ఆమినిగుంట గ్రామ సమీపంలో పులికోన వద్ద క్షుద్ర...
By Kothuru Murali 2026-02-28 12:57:30 0 125
Andhra Pradesh
మై టిడిపి యాప్ ను ప్రారంభించిన తెలుగుదేశం యువ నాయకులు మౌర్యా రెడ్డి గారు
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లె గ్రామంలోని రాజుల కాలనీలో మై టిడిపి పోస్టర్...
By Benguluri Madhubabu 2026-02-22 06:44:19 0 222
Andhra Pradesh
పుంగనూరు: జింకను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
పుంగనూరు మండలం, బోడినాయుడి పల్లి క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వాహనం డికొని జింక మృతి...
By Kothuru Murali 2026-05-15 15:31:56 0 70
Andhra Pradesh
బ్యాటరీ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు ::
కర్నూలు సిటీ :కర్నూలు జిల్లా...ఇద్దరు నిందితులు అరెస్టు.దొంగలించబడిన 11 బ్యాటరీలు...
By Hari Krishna 2026-01-18 11:40:21 0 179
Business & Finance
Build a Section 8 Company the Right Way Legally
A Section 8 Company is a non-profit organization established to promote charitable, educational,...
By Navya Sree 2026-07-13 06:32:03 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com