"వెలుగులో రూ. 1.30 కోట్ల అవినీతి!"

0
162

చింతూరు మండలంలో 'వెలుగు' (ఇందిరా క్రాంతి పథకం) ద్వారా జరిగిన భారీ అవినీతిపై సీఐటీయూ, గిరిజన మరియు మహిళా సంఘాలు గళమెత్తాయి. సుమారు 1.30 కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని, తక్షణమే ఆ సొమ్మును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చింతూరు ఐటీడీఏ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ గారికి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ పోలవరం జిల్లా గిరిజన సంఘం నాయకులు సురేష్ మాట్లాడుతూ. 2017 నుండి 2020 మధ్యకాలంలో మండలంలోని 458 మంది సభ్యుల పేరు మీద వారు అప్పు తీసుకోకపోయినా, తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించారు. లాగిన్ లో విరిపెర్లమీద అప్పు ఉన్నట్లు చూపిస్తుంది అప్పటి సీసీ, ఏపిఎం, ఏపీడి లు మహిళా సంఘాల సొమ్మును స్వాహా చేసినట్లు తెలుస్తుంది.రికార్డుల్లో అప్పులు ఉన్నట్లు చూపిస్తుండటంతో, గత 10 ఏళ్లుగా ఈ పేద మహిళలకు కొత్త అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులు కట్టాలని అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో వారు మానసిక వేదనకు గురవుతున్నారు.ఈ సమస్యపై స్పందించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ , బాధితులతో మాట్లాడి 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
సీ సీ కాలువల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోట్ల
కర్నూలు : నంద్యాల : డోన్  డోన్ అభివృద్ధి బాటలో మరో కీలక ఘట్టం : రూ.19 లక్షలతో సీసీ కాలువల...
By Hari Krishna 2026-01-23 06:54:05 0 143
Telangana
దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన
కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన...
By Ponnala Srinivasrao 2026-05-09 02:16:23 0 88
Media Academy
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed Becoming A Journalist...
By Media Academy 2025-04-28 19:08:32 0 3K
International
A testament to the deep & long standing 🇮🇳-🇬🇭 ties.....
President John Dramani Mahama conferred upon PM Narendra Modi ‘The Officer of the Order of...
By Bharat Aawaz 2025-07-03 07:27:15 0 2K
Andhra Pradesh
TTD: తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో రద్దయిన పాత నోట్ల సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం...
By Pagadala Venkateswar 2026-04-07 04:07:21 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com