పల్లె ప్రజల కోసం 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం... పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి అన్న చంద్రబాబు.

0
121

పల్నాడు జిల్లా ధరణికోటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 62 గ్రామీణ ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటు

పేదల ఆకలి తీరినప్పుడే అది నిజమైన అభివృద్ధి అని వ్యాఖ్య

గత ప్రభుత్వం అన్నదానాన్ని అడ్డుకుందని తీవ్ర విమర్శలు

రాష్ట్రంలో 269కి చేరిన అన్న క్యాంటీన్ల మొత్తం సంఖ్య

పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ఏర్పాటు చేసిన గ్రామీణ అన్న క్యాంటీన్‌ను ఆయన కార్మికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసి, అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు, క్యాంటీన్‌కు వచ్చిన పేదలకు, కార్మికులకు ఆయనే స్వయంగా వడ్డించారు.

 

ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, "పేదవాడి ఆకలి తీర్చడానికే ప్రజా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెచ్చింది. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికారు. అదే స్ఫూర్తితో సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం" అని అన్నారు. 2024లో అధికారంలోకి రాగానే తొలుత పట్టణాల్లో, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కొత్తగా 62 గ్రామీణ క్యాంటీన్లు ప్రారంభం కావడంతో, రాష్ట్రంలో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరిందని, త్వరలో మరో 5 సిద్ధమవుతాయని వివరించారు.

 

అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజూ 2.10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారని, దీనికోసం ప్రభుత్వం రోజుకు రూ.54 లక్షలకు పైగా ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు. కొత్తగా ప్రారంభించిన క్యాంటీన్ల నిర్మాణానికి రూ.43 కోట్లు, వాటి నిర్వహణకు ఏడాదికి అదనంగా రూ.58 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "గత పాలకులు అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్టగొట్టారు. వారికి విధ్వంసం, హింస, కూల్చడం మాత్రమే తెలుసు. అందుకే ఆ పార్టీ పేరును 'గొడ్డలి పార్టీ'గా మార్చుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతను వైసీపీ కోల్పోయింది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన...
By Benguluri Madhubabu 2026-02-26 11:13:25 0 228
Andhra Pradesh
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల ఆవిష్కరణలో పాల్గొన్న డా గొట్టిపాటి లక్ష్మీ గారు
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు & స్వర్గీయ శ్రీ దామచర్ల ఆంజనేయులు గార్ల విగ్రహాల...
By Chennaiah Kati 2026-07-17 07:12:42 0 38
Andhra Pradesh
Nara Lokesh: యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సంబరాలు.
మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్‌...
By Pagadala Venkateswar 2026-01-28 11:11:23 0 162
Business & Finance
Mumbai Property Market Maintains Strong Growth
Mumbai's real estate market continues to maintain strong momentum, with property registrations...
By Navya Sree 2026-07-06 05:22:08 0 38
Telangana
12 న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 12న జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం హైదరాబాద్లో...
By Avunoori Mahesh 2026-04-10 12:18:18 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com