పల్లె ప్రజల కోసం 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం... పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి అన్న చంద్రబాబు.

0
85

పల్నాడు జిల్లా ధరణికోటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 62 గ్రామీణ ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటు

పేదల ఆకలి తీరినప్పుడే అది నిజమైన అభివృద్ధి అని వ్యాఖ్య

గత ప్రభుత్వం అన్నదానాన్ని అడ్డుకుందని తీవ్ర విమర్శలు

రాష్ట్రంలో 269కి చేరిన అన్న క్యాంటీన్ల మొత్తం సంఖ్య

పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ధరణికోటలో ఏర్పాటు చేసిన గ్రామీణ అన్న క్యాంటీన్‌ను ఆయన కార్మికులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసి, అక్కడి కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు, క్యాంటీన్‌కు వచ్చిన పేదలకు, కార్మికులకు ఆయనే స్వయంగా వడ్డించారు.

 

ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, "పేదవాడి ఆకలి తీర్చడానికే ప్రజా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెచ్చింది. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికారు. అదే స్ఫూర్తితో సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం" అని అన్నారు. 2024లో అధికారంలోకి రాగానే తొలుత పట్టణాల్లో, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. కొత్తగా 62 గ్రామీణ క్యాంటీన్లు ప్రారంభం కావడంతో, రాష్ట్రంలో మొత్తం క్యాంటీన్ల సంఖ్య 269కి చేరిందని, త్వరలో మరో 5 సిద్ధమవుతాయని వివరించారు.

 

అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజూ 2.10 లక్షల మంది ఆకలి తీర్చుకుంటున్నారని, దీనికోసం ప్రభుత్వం రోజుకు రూ.54 లక్షలకు పైగా ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు. నాణ్యమైన భోజనం అందించడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను ఆయన అభినందించారు. కొత్తగా ప్రారంభించిన క్యాంటీన్ల నిర్మాణానికి రూ.43 కోట్లు, వాటి నిర్వహణకు ఏడాదికి అదనంగా రూ.58 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "గత పాలకులు అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల పొట్టగొట్టారు. వారికి విధ్వంసం, హింస, కూల్చడం మాత్రమే తెలుసు. అందుకే ఆ పార్టీ పేరును 'గొడ్డలి పార్టీ'గా మార్చుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హతను వైసీపీ కోల్పోయింది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రవీణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*  *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*  ...
By Rajini Kumari 2025-12-16 12:05:04 0 182
Andhra Pradesh
Somu Veerraju: శాసనమండలిలో సోము వీర్రాజుపైకి దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు... సభ రేపటికి వాయిదా.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం చర్చ అనంతరం మరో ప్రశ్నపై మాట్లాడేందుకు...
By Pagadala Venkateswar 2026-02-26 11:32:32 0 99
Andhra Pradesh
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
By Pagadala Venkateswar 2026-04-08 05:40:16 0 110
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 120
Andhra Pradesh
సామర్లకోట: హై వోల్టేజ్ త్రీఫేజ్ పవర్ సరఫరా కట్
సామర్లకోట పట్టణంలో హై వోల్టేజ్ కారణంగా విద్యుత్ పరికరాలు పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. స్థానిక...
By Ratna Sekhar 2026-02-11 14:26:06 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com