టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్

0
153

*టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ నియామకంపై మంగళగిరిలో టీడీపీ శ్రేణుల సంబరాలు, పార్టీకి నూతన ఉత్సాహం*

 

 

మంగళగిరి, ఏప్రిల్ 15 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను ప్రకటించగా, పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేష్ నియమితులైన నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు.మంగళగిరి టీడీపీ కార్యాలయం డా. ఎంఎస్ఎస్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని స్వీట్లు పంచుకుని, బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని,యువ నాయకత్వానికి ఇది పెద్ద గుర్తింపని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య మాట్లాడుతూ, నారా లోకేష్‌ కు లభించిన ఈ పదవి ఆయన కృషికి గుర్తింపని తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ యువతను ఆకర్షిస్తున్న నారా లోకేష్ భవిష్యత్‌లో మరిన్ని అత్యున్నత పదవులు అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తూ, టీడీపీకి ఇది కొత్త దశ ప్రారంభమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 1K
BMA
Fighting the Surge of Deepfakes in Election Coverage
With critical elections unfolding worldwide, reporters are facing an unprecedented wave of...
By Dunna Jessicaruth 2026-05-20 05:58:28 0 126
Andhra Pradesh
పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త...
By Ratna Sekhar 2026-02-19 19:10:42 0 1K
Telangana
ICC T20 ప్రపంచకప్ లో ఫైనల్ కి చేరిన టీం ఇండియా
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది....
By Yadamma Raju Gajapaga 2026-03-05 19:15:13 0 347
Andhra Pradesh
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-04 05:29:18 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com