బీఆర్ అంబేడ్కర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఘన నివాళులు.

0
97

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా బాబాసాహెబ్‌ను స్మరించుకున్నారు.

 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పిస్తూ.. అంటరానితనాన్ని ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగిన అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని కొనియాడారు. "ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుస్తోందంటే దానికి కారణం ఆయన మనకిచ్చిన రాజ్యాంగమే. అంబేడ్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి" అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

మంత్రి నారా లోకేశ్ కూడా అంబేడ్కర్‌కు నివాళులు అర్పించారు. "పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది" అని అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య.
మదనపల్లిలో ఏడేళ్ల బాలిక రిషిక ప్రియా దారుణ హత్యకు గురైంది. సోమవారం అదృశ్యమైన బాలిక మృతదేహాన్ని...
By Pagadala Venkateswar 2026-02-17 05:12:47 0 134
Andhra Pradesh
బిజెపి నాయకులు వివాహ కార్యక్రమంలో
ఈరోజు పత్తికొండ బీజేపీ నాయకులు తుగ్గలి నవీన్ రెడ్డి గారి చెల్లెలు వివాహ వేడుకలో పాల్గొని బీజేపీ...
By Boya Dasthagiri 2026-04-26 13:15:36 0 120
Andhra Pradesh
రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల
నేడు చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కారసాల శశ్వంత్ వీర్ అవిఘ్న పుట్టిన రోజు సందర్భంగా సంరక్ష కోటయ్య...
By Vadlamudi NagaVenkat 2026-03-10 14:56:35 0 643
Andhra Pradesh
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
By Pagadala Venkateswar 2026-02-24 07:22:01 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com