మాకు చెప్పులు అక్కర్లేదు..ఆధారాలతోనే కొడతాం..

0
101

మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్‌ వై.సతీశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే అన్నతీరుగానే ఉందని విమర్శించారు. అంగన్‌వాడీల సెల్‌ఫోన్‌ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంత్రి గారూ దీనికి సిద్దమేనా అని సవాలు విసిరారు.

‎ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే.. చెప్పు తెగుతుందని మంత్రి సీతక్క ఇచ్చిన వార్నింగ్‌పైనా సతీశ్‌ రెడ్డి కౌంటర్లు విసిరారు. మేం ఆధారాలతోనే కొడతాం.. మాకు చెప్పులు అవసరం లేదని స్పష్టం చేశారు. మంత్రి హోదాలో ఉండి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. అంగన్‌వాడీ మొబైల్‌ ఫోన్ల కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందని పునరుద్ఘాటించారు. అంగన్‌వాడీ టీచర్లకు 5జీ ఫోన్లు ఇవ్వాలని కేంద్రం చెబితే.. 4జీ ఫోన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

‎అంగన్‌వాడీ మొబైల్‌ ఫోన్ల కొనుగోళ్లలో నూటికి నూరు శాతం స్కామ్‌ జరిగిందని అన్నారు. కుంభకోణాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ బయటపెట్టే సరికి సీతక్క ఫ్రస్ట్రేషన్‌లో ఊగిపోతున్నారని అన్నారు. దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటే అని విమర్శించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల లో హిందూ సమ్మేళనం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనంలో వక్తలు హైందవ ధర్మాన్ని...
By Kothuru Murali 2026-01-04 11:04:19 0 157
Telangana
"ప్రేమ ప్రవాహిణి" రథోత్సవంలో పాల్గొన్న సాయిబాబా భక్తులు, బిజెపి నాయకులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో నిర్వహించిన భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి 'ప్రేమ...
By Sidhu Maroju 2025-12-28 09:46:47 0 149
Andhra Pradesh
Kalva Srinivasulu: సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమే: వైసీపీపై ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఫైర్.
శాసనసభ చర్చలకు దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించడమేనని ప్రభుత్వ విప్ కాల్వ...
By Pagadala Venkateswar 2026-02-10 09:37:11 0 111
Telangana
నిజామాబాద్.టీజీ ఉద్యమ కరుల సంఘం అద్యక్షుడిగా ప్రదీప్
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అద్యక్షుడిగా ఎనికైనా సినియార్ న్య యావధి యెండల ప్రదీప్ ను...
By Sadaq Sadaq 2026-03-03 11:05:19 1 174
Andhra Pradesh
Chandrababu: అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం: ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు.
ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు...
By Pagadala Venkateswar 2026-04-02 05:56:38 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com