హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!

0
173

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

మంత్రి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ. 70 కోట్లు అక్రమంగా చెల్లించారంటూ వివిధ క్రికెట్ సంఘాలు సోమవారం జింఖానా గ్రౌండ్‌లో మెరుపు ధర్నాకు దిగాయి.

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి ఆదేశాల మేరకు హెచ్‌సీఏలోని పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా రూ. 70 కోట్ల నిధులను విశాఖ ఇండస్ట్రీస్‌కు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.

క్రికెట్ అభివృద్ధికి వాడాల్సిన నిధులను ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనకారులు సంఘటనా స్థలంలో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలను హెచ్‌సీఏ ప్రెసిడెంట్ తీవ్రంగా తోసిపుచ్చారు. ఆందోళనల మధ్యే ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 

"నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క చెక్కు పైనా సంతకం చేయలేదు. విశాఖ కంపెనీకి జరిగిన 69 కోట్ల రూపాయల చెల్లింపుల వ్యవహారం నేను బాధ్యతలు తీసుకోకముందే పూర్తయింది. ఇది గతంలో జరిగిన ప్రాసెస్" అని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, సదరు కంపెనీకి డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని, న్యాయస్థాన ఉత్తర్వుల మేరకే ఆ ప్రక్రియ జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. తనపై బురదజల్లేందుకే కొందరు కావాలని ఈ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరు పక్షాల వాదనలతో హెచ్‌సీఏలో రాజకీయ సెగలు రాజుకున్నాయి.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Jammu & Kashmir
Zero Tolerance: UT Launches Massive Crackdown on Narcotic Syndicates
The administration is tightening the noose on the drug menace. Lieutenant Governor Manoj Sinha...
By Dunna Jessicaruth 2026-05-14 07:33:37 0 83
Telangana
కౌకూరు లో నిన్నంటిన మహిళ దినోత్సవం సంబరాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2026-03-09 11:47:01 0 178
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్.   ...
By Rajini Kumari 2025-12-22 07:46:00 0 215
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం
*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*   *పోలవరం, జనవరి...
By Rajini Kumari 2026-01-20 10:58:14 0 182
SURAKSHA
Gaurav Yadav, IPS: Leading Punjab with Courage & Vision
A distinguished 1992-batch Punjab Cadre IPS officer, Gaurav Yadav has earned national recognition...
By Lokeshwari Panthadi 2026-07-17 11:36:15 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com