హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!

0
124

హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

మంత్రి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కు రూ. 70 కోట్లు అక్రమంగా చెల్లించారంటూ వివిధ క్రికెట్ సంఘాలు సోమవారం జింఖానా గ్రౌండ్‌లో మెరుపు ధర్నాకు దిగాయి.

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి ఆదేశాల మేరకు హెచ్‌సీఏలోని పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా రూ. 70 కోట్ల నిధులను విశాఖ ఇండస్ట్రీస్‌కు విడుదల చేశారని క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.

క్రికెట్ అభివృద్ధికి వాడాల్సిన నిధులను ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా కట్టబెట్టడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నిరసనకారులు సంఘటనా స్థలంలో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలను హెచ్‌సీఏ ప్రెసిడెంట్ తీవ్రంగా తోసిపుచ్చారు. ఆందోళనల మధ్యే ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. 

"నాపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నేను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఏ ఒక్క చెక్కు పైనా సంతకం చేయలేదు. విశాఖ కంపెనీకి జరిగిన 69 కోట్ల రూపాయల చెల్లింపుల వ్యవహారం నేను బాధ్యతలు తీసుకోకముందే పూర్తయింది. ఇది గతంలో జరిగిన ప్రాసెస్" అని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, సదరు కంపెనీకి డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని, న్యాయస్థాన ఉత్తర్వుల మేరకే ఆ ప్రక్రియ జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. తనపై బురదజల్లేందుకే కొందరు కావాలని ఈ ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇరు పక్షాల వాదనలతో హెచ్‌సీఏలో రాజకీయ సెగలు రాజుకున్నాయి.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
వరి ధన్యానికి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైటయించిన బీజేపీ శ్రేణులు
మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్...
By Avunoori Mahesh 2026-05-06 15:18:46 0 119
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో ఖరారైన వైయస్ షర్మిల పర్యటన
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరు పర్యటన ఖరారైంది. ఉపాధి హామీ పరిరక్షణ...
By Kothuru Murali 2026-02-04 16:14:35 0 121
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ నాకాబందీ కార్యక్రమం
గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ : 22.12.2025* _*//గుంటూరు జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నిర్వహించిన...
By KOTESWARARAO KVSR 2025-12-22 06:04:26 0 204
Telangana
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ :   ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2025-09-12 07:33:38 0 275
Andhra Pradesh
గుంటూరు వెస్ట్ డీస్పీ శ్రీ కె. అరవింద్ గారు విద్యార్థులకు మాదగద్రవ్యాల అవగాహన సదస్సు సంకల్పం కార్యక్రమం చేసినారు. గుంటూరు జిల్లా ఎస్పీ మరియు ఐజి ఆదేశాల మేరకు.
గుంటూరు జిల్లా పోలీస్...* *పట్టాభిపురం పోలీస్ స్టేషన్* *తేది: 31.12.2025* _*//“డ్రగ్స్...
By KOTESWARARAO KVSR 2025-12-31 12:18:11 0 518
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com