భావితరాల కోసం రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
114

మంచిర్యాల : సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావితరాలకు మేలు కలగాలని లక్ష్యంగా పెట్టుకుని లక్షేట్టిపేట్ మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.సోమవారం లక్షేట్టిపేట్ ఐబీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో కొంతమందికి నష్టం జరిగిన, సమాజ ప్రయోజనం దృష్ట్యా అందరూ సహకరించాలని కోరారు. 100 మందిలో ఐదుగురికి నష్టం జరిగిన, వారు సహనంతో మిగతా వారికి మేలు జరిగేలా సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో లక్షెట్టీపేట్ మున్సిపల్ చైర్మన్ దొంతు అంజలి -నర్సయ్య , వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి -వెంకట్ స్వామి గౌడ్ , కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా | మే 8 అకాల వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రైతులు మృతి చెందిన ప్రాంతాలను...
By Avunoori Mahesh 2026-05-08 15:22:24 0 140
Andhra Pradesh
ఆర్టీసీలో 7673 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం
ప్రభుత్వాన్ని కోరిన ఆర్టీసీ పాలకమండలి. ఏపీఎస్ఆర్టీసీ సంస్థలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్,...
By Gadiyapudi Narendra 2026-01-27 16:19:31 0 199
Andhra Pradesh
కూట‌మి పాల‌న‌లో స్కీంలు లేవు..అన్నీ స్కాంలే
వైయ‌స్ఆర్‌సీపీ కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గ...
By mahaboob basha 2025-07-19 12:47:15 0 992
Andhra Pradesh
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో బాధ్యతలు
బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామ్మోహనరావు శనివారం బాధ్యతలు...
By Boiena Rajesh 2026-03-21 05:46:50 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com