ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత.

0
147

ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఒంగోలులోని తన స్వగృహంలో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సాహితీలోకంలో విషాదం నెలకొంది.

 

లక్ష్మీనరసింహారావు సాంఘిక శాస్త్ర, ఆంగ్ల ఉపాధ్యాయుడిగా మూడున్నర దశాబ్దాల పాటు పనిచేశారు. సంతనూతలపాడు పరిసర ప్రాంతాల్లో నిబద్ధత కలిగిన ఉపాధ్యాయునిగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా పద్య కవిగా సాహితీ సేవ చేస్తూ వందలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన స్థాపించిన 'పద్య సారస్వత పరిషత్' ద్వారా ఎంతోమంది యువకులను పద్య కవులుగా తీర్చిదిద్దారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిషత్ శాఖలు విస్తృతంగా పనిచేస్తున్నాయి. పద్య సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 'పద్యభారతి' అనే బిరుదు లభించింది.

 

ఆధ్యాత్మిక చింతన కలిగిన ఆయన, ఒంగోలులోని శ్రీపశుపతీశ్వర స్వామి దేవస్థాన నిర్మాణానికి లక్షల రూపాయల విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కొంతకాలం క్రితం ఆయన అర్ధాంగి మరణించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లక్ష్మీనరసింహారావు అంత్యక్రియలు నేడు (సోమవారం) నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
శాంతిభద్రతల పరిరక్షణకు ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్ యజమానులతో సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-07-14 19:16:30 0 58
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు విజయవాడలో రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే...
By Benguluri Madhubabu 2026-01-28 07:35:56 0 263
Andhra Pradesh
ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి, సంక్షేమo విజయోత్సవ సభ
ఈరోజు ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి ప్రభుత్వ “నమ్మకం – అభివృద్ధి,...
By Chennaiah Kati 2026-06-18 11:54:11 0 70
Andhra Pradesh
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తో ప్రజల జీవితాలకు మెరుగు !!
కర్నూలు : తబల శాఖలో అతి పురాతనమైనటువంటి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ తపాల జీవిత బీమా తో...
By Hari Krishna 2025-12-21 09:10:11 0 205
SURAKSHA
S. Krishna Aditya, IAS: Driving Telangana's Progress
A Young Reformer Transforming Governance, Education, and Public Administration with Innovation,...
By Lokeshwari Panthadi 2026-07-14 07:38:12 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com