చింతూరులో ' డ్రోన్ ' నెక్స్ట్ లెవల్ నిఘా 8 మంది అరెస్ట్
Posted 2026-04-13 05:23:02
0
207
ఆదివారం సరదాగా బయట కూర్చుని మందు కొడదామనుకున్న వారికి డ్రోన్ కెమెరా షాక్ ఇచ్చింది. చింతూరులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 8 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.గ్రామ శివార్లలో ఎవరూ చూడటం లేదనుకుని సిట్టింగ్ వేసిన వారిపై డ్రోన్ సహాయంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ గారు వెల్లడించారు.కేవలం ఈ ఒక్క రోజే కాదు, ఇకపై నిఘా మరింత కఠినంగా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు.ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.
# Yadagiri
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి...
విజయవాడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
...పౌరా పౌరాహక్కుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ క్రాంతి చైతన్య అక్రమంగా నిర్భందాన్ని నిరసిస్తూ...
నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి...
ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. ప్రజా విశ్వాసానికి తూట్లు పొడిచిన కూటమి ప్రభుత్వానికి...
వెలుగు లేని పల్లె వెలుగు
కరీంనగర్ జిల్లా.
సందర్భాన్ని బట్టి అయిన సౌకర్యాలు మెరుగుపరిచనీ ఆర్టీసీ సిబ్బంది పట్టించుకోని పై...