శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF

0
823

మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన కుంజ శ్రీనివాస్ (SGT, ఆదిలక్ష్మిపురం, కొత్తగూడ మండలం)ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) కొత్తగూడ, గంగారం మండల కమిటీ పరామర్శించారు.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, వారికి ఆర్థికంగా తోడ్పడేందుకు ₹27,850/- (ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు) సహాయాన్ని జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్ అందజేసిన అనంతరం మాట్లాడుతూ,ఉపాధ్యాయులకు తక్షణమే నగదు రహిత హెల్త్ కార్డులను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే డిటిఎఫ్ శ్రేణులు కుంజ శ్రీనివాస్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా వ్యక్తం చేస్తూ వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చాట్ల పొట్టయ్య, మండల ప్రధాన కార్యదర్శులు తేజ్ మేలాల్, చార్టర్ నాగేశ్వరరావు, గంగారం మండల అధ్యక్షులు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి లక్కాకుల రమేష్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు దశరథ్ కుమార్, కోటి, వాసం ప్రభాకర్, వాసం ప్రమీల, దన్సరి లక్ష్మణ్, బానోత్ వెంకన్న తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పశు ఆరోగ్య శిబిరాల గోడపత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్:  ఈ రోజు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే గారి నివాసంలో ఆంధ్రప్రదేశ్...
By Hari Krishna 2026-01-19 16:23:38 0 135
Andhra Pradesh
గొరవనహల్లిలో 'జనతా ఫౌండేషన్ ట్రస్ట్' ఆవిర్భావం: నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
పరిగి, జనవరి 1, 2026: పరిగి మండలం గొరవనహల్లి గ్రామంలో నిన్నటి రోజున 'జనతా ఫౌండేషన్ ట్రస్ట్'...
By Venugopal Gopal 2026-01-04 09:02:42 0 2K
Andhra Pradesh
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
*Photos :-* అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి...
By Rajini Kumari 2025-12-25 10:46:54 0 239
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com