బీమన్న సేవలో హీరో సాయి దుర్గ తేజ్

0
146

వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని శుక్రవారం మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు స్వామి వారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. శ్రీ భీమేశ్వర స్వామి వారి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. సినిమా సెట్లలో సైతం వేములవాడ చరిత్ర వైభవాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తమకు తెలియజేస్తారని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Telangana
భువనేశ్వర్ నుంచి అక్రమంగా హైదరాబాద్ కు గంజాయి రవాణ. ఇద్దరు నిందితుల పట్టివేత. వారి నుండి 34 కేజీల గంజాయి స్వాధీనం.
17 లక్షల విలువ చేసే 34 కిలోల గంజాయిని సికింద్రాబాద్‌ డిటిఎఫ్ ఎక్సైజ్‌ సిబ్బంది...
By Sidhu Maroju 2025-07-02 13:21:52 0 1K
Andhra Pradesh
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ: చందర్లపాడు మండలం,చింతలపాడు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ లో 1994-97...
By Patan Khuddus 2026-05-11 09:51:09 0 119
Andhra Pradesh
వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని హోటల్ యజమానిపై అధికారి నిర్వాకం
1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం...    1/3 కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్...
By Rajini Kumari 2026-02-07 12:11:36 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com