బీమన్న సేవలో హీరో సాయి దుర్గ తేజ్
Posted 2026-04-10 16:40:26
0
264
వేములవాడ: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని శుక్రవారం మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం గావించగా ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు స్వామి వారి చిత్రపటం లడ్డు ప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ.. శ్రీ భీమేశ్వర స్వామి వారి దర్శించుకోవడం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. సినిమా సెట్లలో సైతం వేములవాడ చరిత్ర వైభవాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు తమకు తెలియజేస్తారని స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నర్సంపేట టు వరంగల్ రహదారిపై ఉదయం ఘోర ప్రమాదం....!
భారత అవాజ్ న్యూస్: 19 మే రోజున ఉదయంరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన దుగ్గొండి మండలంలో...
Securing Our Shores: Lakshadweep’s Coastal Defense System
Lakshadweep’s unique island geography demands a highly specialized approach to maritime...
స్కూల్ విద్యార్థులకు శక్తి బృందం అవగాహన కార్యక్రమం
చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ, బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ సూచనలతో ఇంకొల్లు...
Goa Monsoon Safety: Swimming Banned in Natural Water Bodies
In a critical move to ensure public safety during the turbulent monsoon season, the District...
Fifa world cup
హైదరాబాద్ శిల్పకళా వేదికలో విద్యార్థులతో కలిసి ఫీఫా ప్రపంచ కప్ (అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్)...