"బస్తీ అభివృద్ధికి తలసాని బాట… ప్రజల మాటకే ప్రాధాన్యం.|

0
191

సికింద్రాబాద్: బస్తీ వాసుల అభీష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడతామని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

శుక్రవారం రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని జీరా బస్తీ, పరిసర కాలనీలలో ఆయన అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జీరా గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కమిటీ హాల్ నిర్మాణం కోసం పరిశీలించిన ఎమ్మెల్యే, బస్తీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూ.19 లక్షల వ్యయంతో జీ ప్లస్ వన్ విధానంలో కమిటీ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు.

అనంతరం జీరా బస్తీలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయనకు, వర్షాకాలంలో ఆలయం లీకేజీ సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆలయ మరమ్మతుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.

తదుపరి బస్తీలోని టాయిలెట్లను పరిశీలించిన ఆయన, అవి ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయని స్థానికులు తెలిపిన నేపథ్యంలో, కొత్త టాయిలెట్ల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అక్కడి నుంచి గార్డెన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, పచ్చదనాన్ని పెంచుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. గార్డెన్‌లోని పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం బాలాజీ జీరా బస్తీలో పర్యటించిన సందర్భంగా, ఒక నీటి ట్యాంక్ నిర్మించాలని మహిళలు కోరగా, వాటర్ వర్క్స్ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక కమిటీ హాల్ శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం నిర్మించాలని కోరగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

జీరా ప్రాంతంలో పర్యటించడం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే లక్ష్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా...
By Ponnala Srinivasrao 2026-03-01 06:29:46 0 632
Karnataka
Karnataka Government Eyes Quantum Economy with 20 B USD Action Plan
Karnataka has unveiled a visionary Quantum Action Plan to position the state as a leader in...
By Bharat Aawaz 2025-07-17 06:42:32 0 1K
Andhra Pradesh
రబీ సాగుకు జిల్లాకు 1,250 టన్నుల యూరియా చేరిక
రబీ సీజన్‌లో ఎరువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం 1,250 టన్నుల యూరియా కాకినాడ జిల్లాకు...
By Ratna Sekhar 2026-02-19 19:39:44 0 1K
Telangana
రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు హంతక ప్రభుత్వమే : మాజీ మంత్రి హరీష్‌ రావు
యూరియా అమ్మకాలు నిలిపి వేస్తూ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు...
By Ponnala Srinivasrao 2026-05-06 04:05:40 0 136
SURAKSHA
Dr. Shakil P. Ahammed, IAS: A Legacy of Visionary Governance
A distinguished 1995-batch IAS officer whose administrative excellence, strategic leadership, and...
By Lokeshwari Panthadi 2026-07-22 11:03:47 0 35
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com