వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం

0
624

  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్ యంత్రాంగంతో 19వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ గారు & స్థానిక వార్డు కౌన్సిలర్ ఎలుకంటి విజయ్ గారు..ఈ సందర్భంగా వారు గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను, మంచినీటి, డ్రైనేజ్,పారిశుద్ధ వ్యవస్థను పర్యవేక్షించి..అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు..

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ.

- మున్సిపల్ సిబ్బంది సైడ్ డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను & రోడ్డుకి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని,పారిశుద్ధం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు..- 19వ వార్డులో నీటి సౌకర్యాన్ని పరిశీలించి..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో బోర్లు వేయించడం జరిగిందని వాటికి మోటర్లు కూడా అమర్చడం జరిగిందని..వేసవికాలంలో వార్డులోని ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా & ఇబ్బందుల తలెత్తకుండా చూస్తామని "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం చేస్తున్నామని అన్నారు..అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే ఆహార నాణ్యత,వంట గదుల శుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలను వారు పర్యవేక్షించారు..

- పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పౌష్టికాహారం,స్వచ్ఛమైన నీటిని అందించాలని పారిశుద్ధ్యం లోపించకూడదని అంగన్వాడి సిబ్బందికి సూచించారు..

- పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం మరియు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు.

- నర్సంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో నర్సంపేట పట్టణంలోని ప్రతి వార్డులోనీ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి,పారదర్శక పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో 20వ కౌన్సిలర్ శ్రీరామోజు రోజా రాణి,మున్సిపల్ అధికారులు,వార్డ్ ఆఫీసర్,వార్డు జవాన్,మున్సిపల్ సిబ్బంది,19వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
గోపాల్ నగర్ ప్రధాన రహదారి సమస్యను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాను: బండి రమేష్
    హైదరాబాద్, కుక్కట్ పల్లి, గోపాల్‌నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ యజమానుల విజ్ఞప్తి...
By Jagadeesh Babu 2026-07-10 14:42:26 0 88
Telangana
కోతుల దాడిలో వ్యక్తి మృతి...
భూపాలపల్లి: కోతుల దాడిలో వ్యక్తి మృతి... భారత్ అవాజ్ న్యూస్ భూపాలపల్లి జిల్లా: కేంద్రంలోని జవహర్...
By Gujile Ramu 2026-05-01 03:54:19 0 207
Andhra Pradesh
హోంమంత్రి అనిత‌ని నిల‌దీసిన వైయస్సార్సీపీ ఆర్టీఐ విభాగం వ‌ర్కింగ్
తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ ఆర్టీఐ...
By John Baji 2025-12-29 14:19:29 0 193
Andhra Pradesh
డా. వై. ఎస్. ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం
కర్నూలు !! డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీకి కొత్త వైస్-చాన్సలర్ నియామకంతాడేపల్లిగూడెం డా....
By Hari Krishna 2025-12-12 17:23:28 0 316
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు...
By Kothuru Murali 2026-03-08 08:18:15 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com