భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో మరింత వేగం పెంచాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

0
205

హనుమకొండ, ఏప్రిల్ 10:భద్రకాళి చెరువు పూడికతీత పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం భద్రకాళి చెరువులో కొనసాగుతున్న పూడికతీత పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం కాజీపేట మండలం అమ్మవారిపేటలోని ప్రభుత్వ స్థలాలలో డంపింగ్ చేస్తున్న పూడిక మట్టిని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువులో జరుగుతున్న పూడికతీత పనుల పురోగతిని తెలుసుకుని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. భద్రకాళి చెరువులో తీస్తున్న పూడిక మట్టిని ప్రభుత్వ భూముల్లో క్రమపద్ధతిలో నిల్వ చేయాలని, భూముల పరిరక్షణకు ఇది ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పూడికతీత పనులను మే 15 నాటికి పూర్తిచేసే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అమ్మవారిపేటతో పాటు ఇతర ప్రాంతాలలో పూడిక మట్టిని నిల్వ చేస్తున్న ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.మొత్తం 7.70 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పూర్తయిందని, మిగిలిన పనులను వేగవంతం చేసి లక్ష్యాన్ని సమయానికి చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాగునీటి పారుదల శాఖ ఈఈ కిరణ్ కుమార్, డిఈ మధుసూదన్ రెడ్డి, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఏఈ శ్యామ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలకు అంగరంగ వైభవంగా సిద్దమైన RCM, ఆంధ్ర బాపిస్ట్ చర్చ్...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో "క్రిస్మస్" వేడుకలు ఘనంగా...
By BABJI DADALA 2025-12-24 14:35:32 0 388
Andhra Pradesh
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
మై టిడిపి పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ప్రతి...
By Benguluri Madhubabu 2026-02-17 05:44:28 0 272
Andhra Pradesh
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించిన ఎలక్ట్రిక్ స్టవ్లు కుక్కర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
    రాయచోటి నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రిక్...
By Benguluri Madhubabu 2026-07-04 10:56:50 1 529
Telangana
శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత : మంచిర్యాల మేయర్
మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక...
By Avunoori Mahesh 2026-04-09 09:17:43 0 208
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:54 0 43
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com