భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో మరింత వేగం పెంచాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

0
151

హనుమకొండ, ఏప్రిల్ 10:భద్రకాళి చెరువు పూడికతీత పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం భద్రకాళి చెరువులో కొనసాగుతున్న పూడికతీత పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం కాజీపేట మండలం అమ్మవారిపేటలోని ప్రభుత్వ స్థలాలలో డంపింగ్ చేస్తున్న పూడిక మట్టిని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువులో జరుగుతున్న పూడికతీత పనుల పురోగతిని తెలుసుకుని, మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. భద్రకాళి చెరువులో తీస్తున్న పూడిక మట్టిని ప్రభుత్వ భూముల్లో క్రమపద్ధతిలో నిల్వ చేయాలని, భూముల పరిరక్షణకు ఇది ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పూడికతీత పనులను మే 15 నాటికి పూర్తిచేసే విధంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అమ్మవారిపేటతో పాటు ఇతర ప్రాంతాలలో పూడిక మట్టిని నిల్వ చేస్తున్న ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.మొత్తం 7.70 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పూర్తయిందని, మిగిలిన పనులను వేగవంతం చేసి లక్ష్యాన్ని సమయానికి చేరుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తాగునీటి పారుదల శాఖ ఈఈ కిరణ్ కుమార్, డిఈ మధుసూదన్ రెడ్డి, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఏఈ శ్యామ్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలులో దేవాదాయ శాఖ జోనల్ కార్యాలయం ప్రారంభం
కర్నూలు : 4.25 కోట్ల రూపాయలతో నిర్మించిన దేవదాయశాఖ జోనల్ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Hari Krishna 2025-12-13 10:48:54 0 271
Andhra Pradesh
ఉత్తరాంధ్రలో జోరుగా సంక్రాంతి సంబరాలు
ఈ రోజు సంక్రాంతి  పండుగ లో విశాఖ పట్నం .శ్రీకాకుళం.విజయ నగరం ఉమ్మడి జిల్లాలలో...
By Mobbu Venkatramana 2026-01-15 05:50:33 0 552
Andhra Pradesh
వైసీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత
VZM: వైసీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు...
By Boiena Rajesh 2026-02-28 11:11:29 0 162
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ అధ్యక్షులుగా వరద రెడ్డి
పుంగనూరు నియోజకవర్గ వైయస్సార్సీపి ఉద్యోగుల మరియు పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా వరద రెడ్డి...
By Kothuru Murali 2026-04-16 17:23:48 0 64
Telangana
కరీంనగర్ : డంపింగ్ యార్డ్ పొగతో ప్రజలు విల విల ..!
కరీంనగర్ : మానేరు తీరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ పొగ వల్ల ప్రజలు...
By Sunka Santhosh 2026-04-11 09:37:18 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com