జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా. డీఎస్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి - బీఎస్పీ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్.

0
143

బాపట్ల

బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, దీనికి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గుదే రాజారావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న బియ్యం దందాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజారావు మాట్లాడుతూ,పేద ప్రజలకు కిలో రూపాయి లేదా రెండు రూపాయలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని మధ్యవర్తులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.పేదల వద్ద నుండి కేవలం ₹10లకే బియ్యాన్ని సేకరించి, వాటిని రైస్ మిల్లర్లకు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతున్నా డీఎస్ఓ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. ఇది అధికారుల పనితీరుకే నిదర్శనమని, ముఖ్యమంత్రి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని విమర్శించారు. రేషన్ బియ్యం మాఫియాను అరికట్టడంలో విఫలమైనందుకు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై ఈ క్రింది చర్యలు తీసుకోవాలని రాజారావు డిమాండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన బాపట్ల జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఈ దందాపై విజిలెన్స్ లేదా సిఐడి ద్వారా సమగ్ర విచారణ జరిపించాలి. పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసే మధ్యవర్తులను, సహకరిస్తున్న రైస్ మిల్లర్లను కఠినంగా శిక్షించాలి. పేదల ఆహార హక్కులపై జరుగుతున్న ఈ దాడిని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని, ప్రభుత్వం స్పందించి తక్షణమే విచారణకు ఆదేశించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. * ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా...
By Rajini Kumari 2026-02-28 12:51:53 0 264
SURAKSHA
AP పోలీసు సైబర్ సెల్: ఆన్‌లైన్ మోసాలపై పోరు
 సైబర్ నేరాల నుండి ప్రజలను కాపాడేందుకు AP పోలీసు సైబర్ సెల్ ఈరోజు విజయవాడ IT ఉద్యోగులకు...
By Kalaga Sailaja 2026-07-06 06:07:31 0 57
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.
మదనపల్లె: ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నమయ్య జిల్లా...
By Pagadala Venkateswar 2026-07-16 06:32:03 0 33
Telangana
ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ దూకుడు.. కమిషనర్‌కు వినతిపత్రం.|
మల్కాజ్‌గిరి:  మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి  మల్కాజ్‌గిరి కమిషనర్...
By Sidhu Maroju 2026-04-09 09:51:10 0 542
Telangana
నర్సంపేట మున్సిపాలిటీ భారత జనగణన సర్వే....
  *నర్సంపేట మున్సిపాలిటీ,వరంగల్ జిల్లా.*  *భారత జనగణన 2027 డిజిటల్ సర్వేలో ప్రజలందరూ...
By Gujile Ramu 2026-04-27 11:50:20 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com