వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో

0
176

ఎమ్మిగనూరు నియోజకవర్గం వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన,

ABN ఛానల్, న్యూస్ పత్రిక పై నిరసన కార్యక్రమం మరియు రాధాకృష్ణ దిష్టి బొమ్మ దగ్గం చేసి ఆంధ్రజ్యోతి న్యూస్ పత్రిక ను అగ్గి,మంటల లో వేయడం,తరువాత టౌన్ పోలీస్ స్టేషన్ లో ABN ఛానల్ పై, మీడియా పై,ఎడిటర్ పై కెమెరా మ్యాన్ పై, కేసు నమోదు చేయాలనీ టౌన్ CI, SI గారికి ఫీర్యాదు చేయడం జరిగింది . 

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్రా కార్యదర్శి ఎర్రకోట జగన్ మెహన్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు మండల కన్వీనర్ బసిరెడ్డి గారు మాట్లాడుతూ ABN రాధాకృష్ణ వైసీపీ మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించారు.

 ఒక బాధ్యతాయుత మీడియా అధినేతగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన "మావిగాన్" కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నందున, దాన్ని ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

అమరావతి రాజధాని పేరుతో కొందరు లాభపడాలని చూస్తున్నారని, ABN రాధాకృష్ణ కూడా అదే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ద్వారా కొంతమంది లాభపడేలా చేస్తున్నారని విమర్శించారు.

పచ్చ మీడియా పైశాచిక ఆనందానికి త్వరలోనే ముగింపు పలికే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. 

మహిళలపై చేసిన వ్యాఖ్యలకు పచ్చ మీడియా క్షమాపణ చెప్పేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కానిస్టేబుల్ మృతి: రూ 1 లక్ష సాయం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.
అన్నమయ్య జిల్లాలోని టి. సుండుపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు (46)...
By Pagadala Venkateswar 2026-07-08 11:20:52 0 58
Andhra Pradesh
పుంగనూరు: ఔట్సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి
పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఫిబ్రవరి 12న...
By Kothuru Murali 2026-02-08 10:22:25 0 160
Telangana
ఓటరు నమోదు వేగవంతం.|
"బౌరంపేట్‌లో ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన కొలన్ హన్మంత్ రెడ్డి."...
By Sidhu Maroju 2026-06-30 11:35:44 0 113
Andhra Pradesh
బసినికొండ వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లె సమీపంలోని బసినికొండ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ (24) అనే యువకుడు...
By Pagadala Venkateswar 2026-04-09 04:33:58 0 127
Andhra Pradesh
పుంగనూరు: నిబంధనల మేరకే పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి మండలాలలో సోమవారం తహసిల్దార్లు పార్వతి,...
By Kothuru Murali 2026-04-28 06:32:05 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com