మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతం – పోలీసు అధికారులకు ప్రశంస పత్రాల అందజేత

0
168

మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా, జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల గారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించి, వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.

 

వివిధ రకాల పెండింగ్ కేసులను పరస్పర అవగాహనతో త్వరితగతిన పరిష్కరించడంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసిందని జిల్లా జడ్జి గారు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలకు న్యాయం త్వరగా అందే విధంగా పోలీసు శాఖ చేసిన కృషిని కొనియాడారు. పోలీసు అధికారులు ప్రజలతో సమన్వయం కలిగి, న్యాయ వ్యవస్థతో కలిసి పనిచేయడం వల్లే ఈ లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవలు అందించాలని సూచించారు.

 

డీసీపీ మాట్లాడుతూ...లోక్ అదాలత్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి న్యాయపరంగా సహకరించిన న్యాయ శాఖ వారికీ డిసిపి గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు త్వరితగతిన న్యాయం అందే విధంగా న్యాయస్థానం, పోలీసు శాఖల మధ్య ఉన్న సమన్వయం ప్రశంసనీయమని డీసీపీ పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో సునీత కుంచాల, జిల్లా జడ్జి, కె. స్వప్న రాణి, అదనపు జిల్లా జడ్జి, వి. భావాని, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, ఎన్. మంజుల, జూనియర్ సివిల్ జడ్జి, పెద్దపల్లి, గోదావరిఖని ఏసిపి ఎమ్ రమేష్ పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ మంథని సిఐ రాజు, పి. రాకేష్ ఏ పిపి పెద్దపల్లి, ఎస్సైలు, పలువురు న్యాయమూర్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-03-21 07:18:16 0 159
Madhya Pradesh
Citizen Rights Violated: Dalit Youths Subjected to Custodial Torture in Madhya Pradesh
Bhopal, Madhya Pradesh:In a deeply disturbing case that highlights the misuse of authority and...
By Citizen Rights Council 2025-07-21 06:42:10 0 2K
Telangana
Janagana 2027 start today
జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని...
By G k Nookala 2026-04-26 11:01:53 0 116
Andhra Pradesh
అన్నమయ్య: రైతన్నా.. ‘సైబర్ నేరగాళ్ల లింకులతో జాగ్రత్త’.
ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి జమ చేసిన పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు అందాయి. ఈ నేపథ్యంలో...
By Pagadala Venkateswar 2026-03-14 03:12:09 0 121
Manipur
Justice M. Sundar Appointed Chief Justice of Manipur High Court |
Justice M. Sundar from the Madras High Court has been appointed as the Chief Justice of the...
By Pooja Patil 2025-09-16 07:00:24 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com