మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతం – పోలీసు అధికారులకు ప్రశంస పత్రాల అందజేత

0
197

మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా, జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల గారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించి, వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.

 

వివిధ రకాల పెండింగ్ కేసులను పరస్పర అవగాహనతో త్వరితగతిన పరిష్కరించడంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసిందని జిల్లా జడ్జి గారు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలకు న్యాయం త్వరగా అందే విధంగా పోలీసు శాఖ చేసిన కృషిని కొనియాడారు. పోలీసు అధికారులు ప్రజలతో సమన్వయం కలిగి, న్యాయ వ్యవస్థతో కలిసి పనిచేయడం వల్లే ఈ లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవలు అందించాలని సూచించారు.

 

డీసీపీ మాట్లాడుతూ...లోక్ అదాలత్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి న్యాయపరంగా సహకరించిన న్యాయ శాఖ వారికీ డిసిపి గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు త్వరితగతిన న్యాయం అందే విధంగా న్యాయస్థానం, పోలీసు శాఖల మధ్య ఉన్న సమన్వయం ప్రశంసనీయమని డీసీపీ పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో సునీత కుంచాల, జిల్లా జడ్జి, కె. స్వప్న రాణి, అదనపు జిల్లా జడ్జి, వి. భావాని, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, ఎన్. మంజుల, జూనియర్ సివిల్ జడ్జి, పెద్దపల్లి, గోదావరిఖని ఏసిపి ఎమ్ రమేష్ పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ మంథని సిఐ రాజు, పి. రాకేష్ ఏ పిపి పెద్దపల్లి, ఎస్సైలు, పలువురు న్యాయమూర్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అధికారులను అభినందించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ.
పదేళ్ల క్రితం నాటి హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు: అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Pagadala Venkateswar 2026-01-23 06:07:59 0 161
Health & Fitness
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection As...
By BMA ADMIN 2025-05-20 05:49:20 0 2K
Telangana
కరీంనగర్ : డంపింగ్ యార్డ్ పొగతో ప్రజలు విల విల ..!
కరీంనగర్ : మానేరు తీరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ పొగ వల్ల ప్రజలు...
By Sunka Santhosh 2026-04-11 09:37:18 0 216
Andhra Pradesh
గ్లకోమా (నీటి చుక్కల వ్యాధి)పై అవగాహన సదస్సు.
మదనపల్లి జిల్లా ఆస్పత్రిలో మంగళవారం 'జాతీయ గ్లకోమా వారోత్సవాలు' నిర్వహించారు. కంటిలో నీటి ఒత్తిడి...
By Pagadala Venkateswar 2026-03-10 08:49:21 0 141
Andhra Pradesh
అటల్ బిహారీ వాజ్పేయి గారిని కొనియాడిన దేవినేని ఉమామహేశ్వరరావు
ప్రజామన్ననలు పొందిన నాయకులు అటల్ బిహారీ వాజ్ పేయి ... సమర్థ నాయకత్వంతో సుపరిపాలన అందించారు...
By Rajini Kumari 2025-12-25 11:06:02 0 255
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com