"పరీక్షకు వెళ్లిన యువకుడికి షాక్… పార్క్ చేసిన బైక్ మాయం.|

0
230

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, అల్వాల్ పరిధిలో బైక్ దొంగతనం ఘటన చోటుచేసుకుంది.

08-04-2026 ఉదయం 11:00 గంటలకు జే. సాత్విక్ గౌడ్ (వయసు 18 సంవత్సరాలు), విద్యార్థి, కొంపల్లి సాయి కృపా అపార్ట్‌మెంట్స్ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, 04-04-2026 ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో అల్వాల్ లోని లోయోలా కాలేజ్ వెనుక గేట్ వద్ద యెల్లమ్మ ఆలయం దగ్గర తన మామ  గ్లామర్ బైక్ (నంబర్: TS36C6025) ను పార్క్ చేసి పరీక్షకు వెళ్లాడు.

అయితే పరీక్ష ముగిసిన తరువాత ఉదయం 11:30 గంటలకు వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను దొంగిలించి ఉండవచ్చని బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు.

వెతికే క్రమంలో ఆలస్యమవడంతో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా ఆలస్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగిలించబడిన వాహనాన్ని గుర్తించి తిరిగి పొందేలా చర్యలు చేపట్టారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
పేకాటరాయుళ్ల అరెస్ట్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు...
By Sidhu Maroju 2025-06-06 16:10:13 0 1K
Andhra Pradesh
అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
_*నందవరం మండల పరిధిలోని చిన్నకొత్తిలి గ్రామంలో నిర్వహించిన `రైతన్న… మీకోసం` వారోత్సవాలు...
By Boya Dasthagiri 2026-03-26 00:50:23 0 245
Andhra Pradesh
సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ నియామకం
విజయనగరం జిల్లాలో సీనరేజ్ ఛార్జీల వసూళ్లకు కాంట్రాక్టర్ను నియమించినట్లు జిల్లా గనులు...
By Boiena Rajesh 2026-03-23 04:08:53 0 162
Andhra Pradesh
పుంగనూరు: మడుగు తెరువు లాగిన పెద్దిరెడ్డి
పుంగనూరు పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ...
By Kothuru Murali 2026-03-29 07:36:43 0 135
Andhra Pradesh
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో విషాద ఘటన
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన...   పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం...
By Rajini Kumari 2025-12-23 10:06:39 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com