కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.

0
149

వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి చెందింది. దువ్వూరు మండలం చిన్నబకరాపురం గ్రామ శివార్లలో ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్రమైన ఎండల కారణంగా అడవిలో నీటి వనరులు అడుగంటిపోవడంతో, దాహం తీర్చుకోవడానికి చిరుత కూన గ్రామంలోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

 

గ్రామ శివార్లలోని రైతు పుల్లారెడ్డి పొలంలో చిరుత కూన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నీటి కోసం వచ్చిన చిరుతను వీధి కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేయడంతో అది ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

అనంతరం, చిరుత కూన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత కూన మృతి చెందడంతో పొలాల్లో చిరుత పులుల సంచారం ఉందేమోనని రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Guardian of the Coast: Puducherry’s Maritime Security
Puducherry’s strategic coastal geography necessitates a vigilant approach to maritime...
By Lokeshwari Panthadi 2026-07-03 08:30:03 0 56
Telangana
ఎన్నికలు పకడ్బందీగా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలి
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,   మహబూబాబాద్ జిల్లా, డిసెంబర్ 13:...
By Bheeshman King 2025-12-13 12:49:19 0 346
Telangana
మనూర్ :-. గ్యాస్ కు తప్పని తిప్పలు
మనూర్ మండలంలోని గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం 2 గంటల నుంచే గ్యాస్ గోదాం వద్దా సిలిండర్ లా కోసం క్యూ లొ...
By Gandla Vaijanath 2026-03-27 03:37:55 0 367
Andhra Pradesh
Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన.
    Pawan Kalyan: వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండండి: మూడు పార్టీలకు పవన్ కల్యాణ్ సూచన...
By Pagadala Venkateswar 2026-02-11 09:16:42 0 142
Andhra Pradesh
గుజరాత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పుంగనూరు వాసి మృతి
పుంగనూరు ఎన్ఎస్ పేటకు చెందిన 40 ఏళ్ల లారీ క్లీనర్ అక్రమ్, నాలుగు రోజుల క్రితం గుజరాత్...
By Kothuru Murali 2026-06-14 13:30:03 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com