ప్రజా కలలను బ్రతికించుకుందాం

0
982

------- యోచన, కవి రచయిత ప్రజా వాగ్గేయకారుడు

మహబూబాబాద్/కొత్తగూడ,ఏప్రిల్ 7 (భారత్ అవాజ్): పాఖాల కొత్తగూడలో సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ స్థానిక కామ్రేడ్ పాలడు కృష్ణ స్మారక భవనంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా 7వ మహసభలో ఆయన ముఖ్యఅధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఆర్థిక రాజకీయ సాంఘిక జీవన విధానాల ప్రతిబింబమే సాంస్కృతికి పునాదని, ఆ సమాజం యొక్క ఆర్థిక సామాజిక వ్యవస్థ సమాజం పై ప్రభావం కలగజేస్తూ వర్గ సమాజంలో ప్రజల సంస్కృతి  అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కానీ ప్రభుత్వాలు దీనికి విరుద్ధంగా ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని దెబ్బతీసే పాశ్చాత్య సంస్కృతిని పెంపొందిస్తూ సమాజంలోని ప్రజలందరి సంస్కృతిగా అదే ధర్మసంస్కృతిగా రుద్దుతున్నారని విమర్శించారు. వర్గ సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర తప్ప మరేది కాదని ప్రపంచంలోని ప్రజా పోరాటాల నుండి పుట్టిన ప్రజా సంస్కృతే అరుణోదయ సంస్కృతని అన్నారు. కళ కళ కోసం కాదని ప్రజల కోసమని ప్రజల పక్షం వహించినప్పుడే ఆ కళలు  పదికాలాలపాటు ప్రజల్లో అందరించబడతాయని  తెలిపారు.ఈ సభ కు అధ్యక్షత వర్గం గా ఇ. శ్రీశైలం వ్యవరిస్తూ మాట్లాడుతూ..... పాలక పక్షాలు   ప్రజా కళలను విచ్చిన్నం చేసి, పాశ్చాత్య కళలను ప్రోత్సహిస్తూ  తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.  ఇటువంటి స్థితిలో కళాకారులు ఐక్యమై ప్రజల పక్షాన ప్రజా పోరాటాల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు ముందు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉదయగిరి జెండావిష్కరించి మాట్లాడుతూ అమర కళాకారులకు నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రం లొ కళాకారులతో డప్పు డ్యాన్స్, కోలాట బృందం తో ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మండల వెంకన్న, రాష్ట్ర నాయకులు మోకాళ్ళ మురళి కృష్ణ మాట్లాడుతూ పాట ప్రభుత్వలను ప్రశ్నించాలని, పాట ప్రజల పక్షం నిలవాలని అలాంటి పాట నేడు ప్రభుత్వలకు ఊడిగం చేస్తుందాని  అ విధానాలకు తక్షణమే స్వస్తి పలికి ప్రజా వ్యతిరేక విధానలపై ప్రజలను జాగృతి పలకాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో చారి హరీష్, బుర్కా వెంకటయ్య, లింగ్య నాయక్,రాకేష్, నాగరాజు, ఇర్ప రాజేష్, ట్రైబల్ ఫోరం రాష్ట్ర కొ కన్వీనర్. జామ్లా, పూర్ణచందర్, నాగేష్, రామ్ చందర్, రాజా,గట్టి సురేందర్,దితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, సమాధుల తోటల్లో ప్రత్యేక ప్రార్థనలు.
చీరాల  లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలో ఈస్టర్...
By Vadlamudi NagaVenkat 2026-04-05 08:07:32 0 198
Nagaland
EduConnect 2026 Bridges Career Gaps
The two-day career-oriented event, "EduConnect 2026: Connecting Education to Opportunities,"...
By Dunna Jessicaruth 2026-05-16 06:57:32 0 64
Andhra Pradesh
కరప: గురుకుల పాఠశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు
కరపలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఐదో...
By Ratna Sekhar 2026-03-08 17:35:29 0 701
Andhra Pradesh
మదనపల్లెలో టీడీపీ సీనియర్ నాయకుడు రవీంద్ర మృతి.
మదనపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రీన్ వ్యాలీ స్కూల్ యజమాని రవీంద్ర...
By Pagadala Venkateswar 2026-02-19 06:23:38 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com