ప్రజా కలలను బ్రతికించుకుందాం

0
989

------- యోచన, కవి రచయిత ప్రజా వాగ్గేయకారుడు

మహబూబాబాద్/కొత్తగూడ,ఏప్రిల్ 7 (భారత్ అవాజ్): పాఖాల కొత్తగూడలో సిపిఐ (ఎంఎల్ )న్యూ డెమోక్రసీ స్థానిక కామ్రేడ్ పాలడు కృష్ణ స్మారక భవనంలో జరిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా 7వ మహసభలో ఆయన ముఖ్యఅధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఆర్థిక రాజకీయ సాంఘిక జీవన విధానాల ప్రతిబింబమే సాంస్కృతికి పునాదని, ఆ సమాజం యొక్క ఆర్థిక సామాజిక వ్యవస్థ సమాజం పై ప్రభావం కలగజేస్తూ వర్గ సమాజంలో ప్రజల సంస్కృతి  అనుకూలంగా ఉంటుందని తెలిపారు. కానీ ప్రభుత్వాలు దీనికి విరుద్ధంగా ప్రత్యామ్నాయంగా ప్రజా సంస్కృతిని దెబ్బతీసే పాశ్చాత్య సంస్కృతిని పెంపొందిస్తూ సమాజంలోని ప్రజలందరి సంస్కృతిగా అదే ధర్మసంస్కృతిగా రుద్దుతున్నారని విమర్శించారు. వర్గ సమాజాల చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర తప్ప మరేది కాదని ప్రపంచంలోని ప్రజా పోరాటాల నుండి పుట్టిన ప్రజా సంస్కృతే అరుణోదయ సంస్కృతని అన్నారు. కళ కళ కోసం కాదని ప్రజల కోసమని ప్రజల పక్షం వహించినప్పుడే ఆ కళలు  పదికాలాలపాటు ప్రజల్లో అందరించబడతాయని  తెలిపారు.ఈ సభ కు అధ్యక్షత వర్గం గా ఇ. శ్రీశైలం వ్యవరిస్తూ మాట్లాడుతూ..... పాలక పక్షాలు   ప్రజా కళలను విచ్చిన్నం చేసి, పాశ్చాత్య కళలను ప్రోత్సహిస్తూ  తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.  ఇటువంటి స్థితిలో కళాకారులు ఐక్యమై ప్రజల పక్షాన ప్రజా పోరాటాల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు ముందు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉదయగిరి జెండావిష్కరించి మాట్లాడుతూ అమర కళాకారులకు నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రం లొ కళాకారులతో డప్పు డ్యాన్స్, కోలాట బృందం తో ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మండల వెంకన్న, రాష్ట్ర నాయకులు మోకాళ్ళ మురళి కృష్ణ మాట్లాడుతూ పాట ప్రభుత్వలను ప్రశ్నించాలని, పాట ప్రజల పక్షం నిలవాలని అలాంటి పాట నేడు ప్రభుత్వలకు ఊడిగం చేస్తుందాని  అ విధానాలకు తక్షణమే స్వస్తి పలికి ప్రజా వ్యతిరేక విధానలపై ప్రజలను జాగృతి పలకాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో చారి హరీష్, బుర్కా వెంకటయ్య, లింగ్య నాయక్,రాకేష్, నాగరాజు, ఇర్ప రాజేష్, ట్రైబల్ ఫోరం రాష్ట్ర కొ కన్వీనర్. జామ్లా, పూర్ణచందర్, నాగేష్, రామ్ చందర్, రాజా,గట్టి సురేందర్,దితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠలో కాంగ్రెస్ నాయకులు ఎస్. రెడ్డీ సాహెబ్.
మదనపల్లె సీటీఎం రోడ్ శివాజీ నగర్‌లో ఆదివారం శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం...
By Pagadala Venkateswar 2026-03-09 05:42:58 0 105
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ ఏర్పాటుకు పరిశీలన
కర్నూలు  : కర్నూలు జిల్లా  కర్నూలు జిల్లా.   రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు...
By Hari Krishna 2026-02-03 12:31:43 0 395
Andhra Pradesh
డోన్ లో ఏసీబీ దాడులు !!
కర్నూలు : నంద్యాల జిల్లా డోన్ (ద్రోణాచలం) సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు...
By Hari Krishna 2025-12-22 08:12:23 0 194
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:10:41 0 45
Andhra Pradesh
సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి.
  సీఎం చంద్రబాబుతో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ.. కీలక సమస్యలపై వినతి 09-04-2026 Thu 07:50 |...
By Pagadala Venkateswar 2026-04-09 04:44:24 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com