Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

0
127

Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

07-04-2026 Tue 08:05 | Andhra

Kanthamma loses gold chain in Chittoor district fraud

షార్ట్స్‌లో చూడండి

చిత్తూరు జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. ‘జాగ్రత్తగా దాచుకోండి’ అని చెప్పి, ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును చాకచక్యంగా కొట్టేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది.

 

వివరాల్లోకి వెళ్తే.. కాంతమ్మ అనే స్థానిక మహిళ బ్యాంకు పని మీద బయటకు వచ్చారు. ఆమె బ్యాంకు వద్దకు చేరుకోగానే, గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆమెను మాటల్లోకి దించారు. మెడలో బంగారు గొలుసు వేసుకోవడం సురక్షితం కాదని, దాన్ని తీసి భద్రంగా దాచుకోవాలని నమ్మబలికారు. తామే సహాయం చేస్తామంటూ ముందుకు వచ్చి, ఆమె గొలుసును ఒక కాగితంలో చుట్టి ఇచ్చారు.

 

వారి మాటలు నమ్మిన కాంతమ్మ ఆ పొట్లాన్ని తీసుకుని బ్యాంకు లోపలికి వెళ్లింది. అక్కడ పొట్లం విప్పి చూడగా, అందులో బంగారు గొలుసుకు బదులుగా రాళ్లు ఉండటంతో నిర్ఘాంతపోయింది. తాను మోసపోయానని గ్రహించి గట్టిగా విలపించింది.

 

బాధితురాలు వెంటనే పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కారు ఆటో డీ కొట్టుకోవడం వలన ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు బైపాస్ రోడ్డులో కారు ఆటోను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు...
By Kothuru Murali 2026-01-03 11:10:51 0 199
Andhra Pradesh
పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. * ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా...
By Rajini Kumari 2026-02-28 12:51:53 0 264
Business & Finance
Secure Your Business Growth with the Right Loan
Secured loans provide businesses and individuals with access to higher loan amounts by offering...
By Navya Sree 2026-07-20 06:31:28 0 28
Telangana
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో పెరిగిన ఎండలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ తెలంగాణలో మార్చి రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు 40...
By Pinnehasan Odela 2026-03-06 06:38:45 0 217
Andhra Pradesh
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
By John Baji 2025-12-31 05:49:13 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com