Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

0
90

Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

07-04-2026 Tue 08:05 | Andhra

Kanthamma loses gold chain in Chittoor district fraud

షార్ట్స్‌లో చూడండి

చిత్తూరు జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. ‘జాగ్రత్తగా దాచుకోండి’ అని చెప్పి, ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును చాకచక్యంగా కొట్టేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది.

 

వివరాల్లోకి వెళ్తే.. కాంతమ్మ అనే స్థానిక మహిళ బ్యాంకు పని మీద బయటకు వచ్చారు. ఆమె బ్యాంకు వద్దకు చేరుకోగానే, గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆమెను మాటల్లోకి దించారు. మెడలో బంగారు గొలుసు వేసుకోవడం సురక్షితం కాదని, దాన్ని తీసి భద్రంగా దాచుకోవాలని నమ్మబలికారు. తామే సహాయం చేస్తామంటూ ముందుకు వచ్చి, ఆమె గొలుసును ఒక కాగితంలో చుట్టి ఇచ్చారు.

 

వారి మాటలు నమ్మిన కాంతమ్మ ఆ పొట్లాన్ని తీసుకుని బ్యాంకు లోపలికి వెళ్లింది. అక్కడ పొట్లం విప్పి చూడగా, అందులో బంగారు గొలుసుకు బదులుగా రాళ్లు ఉండటంతో నిర్ఘాంతపోయింది. తాను మోసపోయానని గ్రహించి గట్టిగా విలపించింది.

 

బాధితురాలు వెంటనే పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కూల్చివేత యత్నంతో జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత.
మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత...
By Pagadala Venkateswar 2026-05-16 05:01:55 0 53
Andhra Pradesh
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: 20 నెలల పాలన.. 60 విజయాలు.. ప్రజలకు వివరించండి: కూటమి నేతలకు జాబితా ఇచ్చిన...
By Pagadala Venkateswar 2026-02-11 13:10:46 0 192
Andhra Pradesh
డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
*For Scrolls...*   నంద్యాల జిల్లా   * డోన్ నియోజకవర్గం, కొత్తబురుజులో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-03-10 08:52:33 0 143
Andhra Pradesh
సింగపూర్ లో ఐదవ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ
* *సింగపూర్‌లో 5 వ రోజు కొనసాగుతున్న మంత్రుల శిక్షణ కార్యక్రమం*   * *సింగపూర్ సంక్షోభ...
By Rajini Kumari 2026-04-25 11:46:45 0 128
Andhra Pradesh
పుంగనూరు: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి: ఏఐటీయూసీ
తిరుపతిలో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పుంగనూరు సివిల్...
By Kothuru Murali 2026-04-22 14:45:55 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com