Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం.

0
241

Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం

05-04-2026 Sun 19:43 | Andhra

RTC Bus Fire in Kadapa District All Passengers Safe

 

వైఎస్ఆర్ కడప జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా, డ్రైవర్ వేగంగా స్పందించడంతో అందులో ఉన్న 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి సమీపంలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో వేంపల్లి నుంచి కదిరికి బయలుదేరింది. వీరన్నగట్టుపల్లి వద్దకు రాగానే, రోడ్డుకు అడ్డంగా తక్కువ ఎత్తులో వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు బస్సు పైభాగానికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. బస్సు లోపల పొగలు, మంటలు గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.

 

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులందరినీ హుటాహుటిన కిందకు దించారు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే బస్సు కాలి బూడిదైంది.

 

విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడటమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Search
Categories
Read More
Telangana
పోలీస్ కాటన్ సెర్చ్
మంచిర్యాల్ కార్పొరేషన్  లో హమాలివాడ నిన్న రామగుండం సిపి అంబర్ కిషోర్ గారు, డిసిపి భాస్కర్,...
By Bonagiri RaviShankar 2026-05-17 11:31:12 0 82
Andhra Pradesh
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
By Pagadala Venkateswar 2026-03-18 03:17:19 0 137
Andhra Pradesh
యునైటెడ్ ఇన్సూరెన్స్ ఇండియా లో ఉద్యోగాలు!!
కర్నూలు : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ - చెన్నై యూనిట్ వివిధ విభాగాల్లో 153 గ్రాడ్యుయేట్...
By Hari Krishna 2025-12-22 08:28:43 0 193
Andhra Pradesh
శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ...
By Benguluri Madhubabu 2026-03-21 07:34:56 0 157
Andhra Pradesh
నాణ్యమైన ఎలిమెంట్లను వేసుకోవాలి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల ఎస్సై రమేష్, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను ధరించాలని...
By Kothuru Murali 2026-01-06 09:25:13 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com