Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం.

0
355

Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం

05-04-2026 Sun 19:43 | Andhra

RTC Bus Fire in Kadapa District All Passengers Safe

 

వైఎస్ఆర్ కడప జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా, డ్రైవర్ వేగంగా స్పందించడంతో అందులో ఉన్న 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి సమీపంలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో వేంపల్లి నుంచి కదిరికి బయలుదేరింది. వీరన్నగట్టుపల్లి వద్దకు రాగానే, రోడ్డుకు అడ్డంగా తక్కువ ఎత్తులో వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు బస్సు పైభాగానికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. బస్సు లోపల పొగలు, మంటలు గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.

 

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులందరినీ హుటాహుటిన కిందకు దించారు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే బస్సు కాలి బూడిదైంది.

 

విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడటమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: బ్యాలెన్స్ కుదిరింది... కేంద్ర బడ్జెట్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందన.
కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించిన మంత్రి నారా లోకేశ్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని...
By Pagadala Venkateswar 2026-02-01 11:02:15 0 160
Andhra Pradesh
పుంగనూరు: రాష్ట్ర యువజన కోకన్వీనర్ గా ప్రేమ్ కుమార్
బీసీవై పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్‌గా పుంగనూరుకు చెందిన న్యాయవాది ప్రేమ్...
By Kothuru Murali 2026-02-01 13:53:27 0 185
Andhra Pradesh
Andhra Pradesh Boosts Disaster Preparedness Measures
Andhra Pradesh continues to strengthen its disaster preparedness framework to address cyclones,...
By Fathima Safa 2026-06-27 11:10:22 0 90
Andhra Pradesh
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని వేగంగా...
By Pagadala Venkateswar 2026-05-04 06:05:59 0 97
Telangana
నిజామాబాద్.14 సo! వస్తరాల బాలికలకు హె పి వి టికా ఎపించలి DMHO
14 సంవతరాల బాలికలందరికి HPV టికా ఐపించలాని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ సుచించారు.జిల్లా వైద్య...
By Sadaq Sadaq 2026-03-06 18:00:24 1 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com