డీప్‌ఫేక్‌లపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ అవగాహన సందేశం |

0
177

హైదరాబాద్ : డిజిటల్‌ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి .సజ్జనర్ ఐపీఎస్ సూచించారు. 

ఈ మేరకు ఆయన ప్రజలకు అవగాహన కల్పించే సందేశాన్ని విడుదల చేశారు.

ఏఐ సాంకేతికతను ఉపయోగించి నిజంలా కనిపించే నకిలీ వీడియోలు, ఫొటోలను సైబర్ నేరగాళ్లు సృష్టించి సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. 

అలాంటి కంటెంట్‌ను చూసిన వెంటనే నమ్మకుండా ముందుగా జాగ్రత్తగా పరిశీలించాలని ప్రజలను హెచ్చరించారు.

డీప్‌ఫేక్‌ వీడియోలు లేదా ఫొటోలను నిశితంగా గమనిస్తే లైటింగ్‌లో తేడాలు, ముఖ కవళికల్లో సహజత్వం లేకపోవడం, కదలికల్లో అసహజత్వం వంటి లక్షణాల ద్వారా అవి నకిలీ అని గుర్తించవచ్చని సీపీ సజ్జనర్ పేర్కొన్నారు.

ఏదైనా వీడియో లేదా ఫొటోపై అనుమానం వచ్చినప్పుడు వెంటనే రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయడం ద్వారా ఆ కంటెంట్ అసలు ఎక్కడిదో తెలుసుకోవచ్చని సూచించారు.

వాస్తవాలను నిర్ధారించుకోకుండా భావోద్వేగానికి లోనై ఇతరులకు ఫార్వార్డ్ చేస్తే సమాజంలో అశాంతికి కారణమయ్యే ఫేక్ న్యూస్ వ్యాప్తిలో మనమూ భాగస్వాములు అవుతామని హెచ్చరించారు.

కాబట్టి సోషల్‌ మీడియాలో ఏదైనా వీడియో లేదా ఫొటోను షేర్‌ చేసే ముందు “ఆలోచించండి – నిర్ధారించుకోండి – తర్వాతే షేర్ చేయండి” బాధ్యతాయుతమైన విధానాన్ని పాటించాలని హైదరాబాద్ సీపీ ప్రజలకు సూచించారు.

డీప్‌ఫేక్‌ల యుగంలో విమర్శనాత్మక ఆలోచన, సమాచారాన్ని ధృవీకరించే అలవాటు ప్రతి పౌరుడికి అత్యంత ముఖ్యమైన రక్షణగా మారిందని ఆయన తెలిపారు.

#sidhumaroju

Alwal

 

Search
Categories
Read More
Andhra Pradesh
జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలు
విశాఖ పట్నం మధుర వాడ లో నివాసం ఉండే రత్న కుమారి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా ఉప...
By Mobbu Venkatramana 2026-03-31 16:25:33 0 341
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్‌లో చిన్న క్రేట్ల విధానం ప్రారంభం.
మదనపల్లి టమోటా మార్కెట్‌లో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా 15 కిలోల చిన్న క్రేట్ల విధానాన్ని...
By Pagadala Venkateswar 2026-03-10 04:29:25 0 138
Tamilnadu
Tamil Nadu Advances Urban Development and Smart Cities
Tamil Nadu continues to accelerate urban development through Smart Cities Mission projects,...
By Fathima Safa 2026-07-02 06:43:54 0 42
Andhra Pradesh
రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి ముగింపు వేడుకలు
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ముగింపు వేడుకలు రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ...
By Vadlamudi NagaVenkat 2026-03-16 09:59:06 0 615
SURAKSHA
Vinay Kumar Gadge, IPS: A Visionary Guardian of Justice
A dedicated IPS officer of the AGMUT Cadre, Vinay Kumar Gadge has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-22 07:20:26 0 39
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com