శామీర్‌పేట ప్రెస్ మీట్‌లో ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు.|

0
91

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేటలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్ నుంచి వెళ్లి ఐదేళ్లు అయినప్పటికీ పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, “పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు” అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనను టిఆర్ఎస్ పార్టీ నుంచి పంపించడం తప్పు అని ప్రజల్లో చర్చ జరుగుతోందని, తాను ఎప్పుడూ పదవుల కోసం రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. గతంలో తనపై అన్యాయాలు జరిగాయని, భూములు, ఆస్తులపై ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆరోపించారు.

ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, అబద్ధాలపై పాలన కొనసాగుతోందని అన్నారు. GHMC ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, పార్టీ బలోపేతానికి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

#sidhumaroju

Alwal

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com